తెలుగు సినిమా రంగంలో తెలుగింటి అబ్బాయిగా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు అమ్మాయిలను అలరిస్తున్న నాగశౌర్య అతితక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో పాపులర్ హీరో అయిపోయాడు. ఊహలు గుసగుసలే సినిమాతో బంపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తాజాగా ఇటీవల అక్కినేని వారి ఇంటి కోడలు సమంత పక్కన నటించే స్థాయికి ఎదిగిపోయాడు. ఒకపక్క కుటుంబ కథ చిత్రాలను చేస్తూ మరో పక్క తన స్టైల్లో సినిమాలు ఒప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో  టాలీవుడ్ కుర్ర హీరో నాగ శౌర్య కి హైదరాబాద్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.


విషయంలోకి వెళితే ఇటీవల హైదరాబాద్ నగరంలో పంజాగుట్ట పరిధిలో ఉన్న పోలీసులు నాగశౌర్య ప్రయాణిస్తున్న కారుకు బ్లాక్ ఫిలిం ఉందని పోలీసులు గుర్తించి నాగ శౌర్య కి జరిమాన విధించారు. దీంతో నాగశౌర్య పంజాగుట్ట ఇన్స్పెక్టర్ రవికి 500 రూపాయలు జరిమానా కట్టారు. తర్వాత వెంటనే తన కారు కొన్న బ్లాక్ ఫిలిం ని తొలగించారు. ఈ సంఘటన బంజారా హిల్స్ రోడ్ నెం 1 లో జరిగింది. ఇండియాలో వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించడం నిషేధం. సుప్రీం నిబంధన 2012 ప్రకారం ఈ నేరం కింద జరిమానా విధిస్తారు. కొన్నిరోజుల క్రితమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెందిన వాహనానికి కూడా బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో పోలీసులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం నాగ శౌర్య పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాబోయే రోజుల్లో పక్కా ప్లానింగ్ తో నాగశౌర్య తను చేయబోయే ప్రాజెక్టులను ఒప్పుకుంటు మెల్ల మెల్లగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల సమంత పక్కన ఓ బేబీ సినిమాలో నటించిన నాగ శౌర్య కి మంచి పేరు రావడంతో పాటు అటువంటి క్యారెక్టర్లు చేస్తే భవిష్యత్తులో క్రేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు రావటంతో వెంటనే నాగ శౌర్య భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన కమిట్మెంట్ లు చాలా జాగ్రత్తగా తిసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: