బిగ్ బాస్ సీజన్ 3లో క్రేజీ కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చింది బుల్లితెర యాంకర్ శ్రీముఖి. యాంకరింగ్ తో పాటుగా అడపాదడపా సినిమాల్లో కూడా సందడి చేసే శ్రీముఖికి ఆడియెన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా వచ్చిన 15 మందిలో శ్రీముఖికి ఎక్కువ రెమ్యునరేషన్ కూడా అని తెలుస్తుంది. అదలా ఉంటే ఇంట్లో అందరు మాత్రం శ్రీముఖిని టార్గెట్ చేస్తున్నారు.


మొదటివారానికే బిగ్ బాస్ హౌజ్ లో గ్రూపులు ఏర్పడగా తానే గ్రూప్ కు సంబందించిన వ్యక్తి కాదంటూనే బాబా భాస్కర్ తో డిస్కషన్స్ పెడుతుంది శ్రీముఖి. ఇక లాస్ట్ వీక్ జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో రవి చేతికి గాయమవడానికి కారణం శ్రీముఖి అని తేలింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు శ్రీముఖి మీద రాహుల్ చాలా ఫైర్ అయ్యాడు.


అతనే కాదు ఛాన్స్ ఉంది అంటే అందరు శ్రీముఖిని టార్గెట్ చేసేందుకు చూస్తున్నారు. దీనికి కారణం ఆమె స్ట్రాంగ్ కంటెస్టంట్ కావడం అయితే మరోటి శ్రీముఖి బయటకు వెళ్తే పోటీలోంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టంట్ వెళ్లినట్టు అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఇంటి సభ్యులు తనని ఎలా టార్గెట్ చేసినా శ్రీముఖి మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా శ్రీముఖి పేరు చెప్పగానే బయట స్నేహితుడు అని చెప్పుకున్న రాహుల్ సిప్లిగంజ్ గొడవకు దిగుతున్నాడు.


మరి శ్రీముఖి వీళ్ల నుండి తనని తాను ఎలా రక్షించుకుని గేం ఆడుతుందో చూడాలి. ఇంట్లో ఉన్న అందరి సభ్యులలో హిమజకు ఎక్కువ ఓటింగ్స్ వస్తున్నాయి. ఆమె సెంటిమెంట్ తో అందరిని బుట్టలో వేసుకుంటుంది. లాస్ట్ వీక్ అలి రెజాతో జరిగిన గొడవ వల్ల హిమజకు మరింత మైలేజ్ వచ్చింది. మరి ప్రస్తుతం ఇంట్లో 13 మంది ఉన్నారు. వారిలో ఎవరు విన్న్నర్ అవుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: