టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ స్టార్ కమెడియన్ ఆలీ చాలా సినిమాలలో ప్రకటించాడు. బాల నటుడి గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆలీ హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించాడు. ఒకపక్క హీరో చేస్తుండగానే మరోపక్క కమెడియన్ రోల్స్ ని మాత్రం వదిలిపెట్టలేదు. ఇటువంటి నేపథ్యంలో ఆలీ హీరోగా తాజాగా నటించిన పండుగాడి ఫోటో స్టూడియో అనే సినిమా ఆగస్టు 23 వ తారీఖు న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు డైరెక్టర్ బోయపాటి శ్రీను మరియు పూరి జగన్నాథ్. ఈ సందర్భంగా ఎప్పటిలాగానే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన స్పీచ్ తో ఆడియో వేడుకకు వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆలీ గురించి అనేక సంచలన ఆసక్తికరమైన విషయాలను వేదికపై అభిమానులతో పూరి జగన్నాథ్ పంచుకున్నారు.


పూరి జగన్నాథ్ ఆలీ గురించి ఏమన్నారంటే...తన సినిమా విజయం సాధించి సంతోషంలో ఉన్నా, పరాజయం చెంది నిరాశలో ఉన్నా అలీ ఒక్కడే పిలవకుండా వస్తాడని పూరి అన్నారు. సినిమా హిట్టయితే ఓ హగ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోతాడు. సినిమా ఫ్లాపై నిరాశలో ఉంటే ఓ పెగ్ తనకు పోసి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. తమ కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చాయి. అలీ చేసిన పాత్రలు బాగా పాపులర్ అయ్యాయని పూరి గుర్తుచేసుకున్నారు.


ఈ సందర్భంగా తన వాస్తవ జీవితం గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో టైం బ్యాడ్ అయ్యి ఆస్తులు పోగొట్టుకోవడం జరిగిందని...ఆ సమయంలో చివరకు ఆఫీసు కూడా అమ్మేసి వెళ్ళిపోతుంటే ఆలీ  పలకరించడానికి వచ్చాడు. అమ్మవారి దగ్గర పూజ చేసిన చిన్న విగ్రహాన్ని నాకు ఇచ్చాడు. దీనిని మెడలో వేసుకో భయ్యా అని అన్నాడు. దేవుడిపై నమ్మకం లేకుంటే కనీసం జేబులో పెట్టుకుని అయినా తిరుగు.. దెబ్బతో పోయిన నీ ఆస్తులన్నీ తిరిగొస్తాయి అని చెప్పాడు. అలీ ఆ మాట చెప్పిన రెండేళ్లకు తన ఆస్తులు మొత్తం తిరిగొచ్చాయని పూరి ఆడియో వేడుకలో తెలిపారు. మొత్తంమీద కమెడియన్ ఆలీ తన ఫ్లాపుల్లో విజయాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటాడని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: