రష్మిక మందన్న టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ హీరోయిన్లలో ఒకరు. ఛలో సినిమా తరువాత తిరిగి కర్ణాటక వెళ్లి పెళ్లి చేసుకుందామని అనుకుంది. కానీ, గీతగోవిందం సినిమా సూపర్ హిట్ కావడం ఆమెకు అదృష్టంగా మారింది. సినిమా హిట్ కావడం దేవదాస్ లో అవకాశం దొరకడం. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రష్మికకు లక్ కలిసి వచ్చింది.
విజయ్ దేవరకొండతో చేసిన డియర్ కామ్రేడ్ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా ఆమె నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పడు రష్మిక తెలుగులో సరిలేరు నీకెవ్వరూ, భీష్మ చేస్తున్నది. సరిలేరు నీకెవ్వరూ లో మహేష్ హీరో. ఇటీవలే రష్మిక షూటింగ్ లో జాయిన్ అయ్యింది. మహేష్ తో కలిసి నటించడం ఎలా ఉన్నది అంటే చెప్పలేనంత హ్యాపీగా ఉందని అంటోంది.
ఎగ్జైట్మెంట్ ను ఆపుకోలేక రష్మిక సినిమా విషయాలు చెప్పేస్తుందేమో అని భయపడుతున్నారు. తొందర పడి సినిమాలోని ఏదైనా విషయాన్ని లీక్ చేస్తే ఆ తరువాత పీక్కోలేక లాక్కోలేక చావాలి. అందుకే విషయాలు లీక్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఈ అమ్మడు జాగ్రత్తగా ఉంటుంది అందుకే. అయితే, రష్మిక ఓ ట్వీట్ చేసింది.
"అద్భుతమైన మనుషులు.. ఎన్నో నవ్వులుపువ్వులు.. పొట్టచెక్కలయ్యే క్షణాలు. మళ్ళీ ఎంత త్వరగా జాయిన్ అవుతానా అనిపిస్తోంది" అని ట్విట్టర్లో పేర్కొంది. సినిమాను పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న మాట వాస్తవమే. పక్కా ఎంటర్టైనర్ తో పాటు మహేష్ అభిమానులకు కావాల్సిన అన్ని విషయాలు అందులో ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు. సెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది. అనిల్ వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది.