అడివి శేష్ ఇప్పుడేదో వచ్చి క్షణం, గూఢచారి, ఎవరు సినిమాల హిట్  కొట్టడం కాదు. 2002లో వచ్చిన సొంతం సినిమాలో కూడా అడివి శేష్ ఉన్నాడని ఎంతవరకు తెలుసు. అంటే మనోడు అప్పటి నుండి సినిమా కోసం కష్టపడుతున్నాడన్నమాట. కర్మ, కిస్ అంటూ సొంత ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్న అడివి శేష్ సైడ్ క్యారక్టర్స్ చేస్తూ వచ్చాడు.     


ఫైనల్ గా క్షణం సినిమా అతనిలోని టాలెంట్ గుర్తించేలా చేసింది. గూఢచారి సినిమా కూడా అడివి శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. టాలీవుడ్ అసలు సిసలైన జేమ్స్ బాండ్ సినిమా ఇదే అంటూ గూఢచారి సినిమాపై ప్రశంసలు వచ్చాయి. ఇక రీసెంట్ గా ఎవరు సినిమాతో అడివి శేష్ తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.    


ఎవరు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఈ సక్సెస్ ను పురస్కరించుకుని సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు అడివి శేష్ పై ప్రశంసలు కురిపించాడు. తనకు కథల జడ్జ్ మెంట్ ఉందని కాని ఇలాంటి ట్విస్టుల మీద మాత్రం అడివి శేష్ కు గ్రిప్ ఉందని అన్నాడు. ఇక త్వరలోనే మా బ్యానర్ లో అడివి శేష్ సినిమా చేస్తాడని అన్నారు దిల్ రాజు.


అడివి శేష్ కూడా దిల్ రాజు బ్యానర్ లో ఎవడు సినిమాలో మెయిన్ విలన్ గా చేయాల్సి ఉంది. కాని ఆ ఛాన్స్ మిస్సైంది. ఇప్పుడు దిల్ రాజు గారు తన బ్యానర్ లో సినిమా ఆఫర్ ఇస్తున్నారు. ఇంతకన్నా సంతోషించదగ్గర విషయం ఏముంటుందని అన్నాడు అడివి శేష్. దిల్ రాజు బ్యానర్ లో అడివి శేష్ కథతో సినిమా కచ్చితంగా కథ పరంగా సినిమా పరంగా అడివి శేష్ సూపర్ హిట్ బొమ్మ చేస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: