టబు ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా అనేక సినిమాలు చేసింది.  వరస విజయాలు సాధించింది.  టబు చేసిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.  అయితే, కొంత బ్రేక్ తీసుకున్నాక ఈ హీరోయిన్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  


తెలుగులో ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చేస్తున్నది.  47 ఏళ్ళ వయసులో కూడా టబు ఈ సినిమాలో హీరోయిన్ లా చాలా చక్కగా ఉన్నది.  అన్ని విధాలా సూపర్ గా సెట్ అయ్యింది.  అత్తారింటికి దారేది సినిమాలో నదియా.. ఎంత బాగున్నదో చెప్పాల్సిన అవసరం లేదు.  అందులో చాలా యంగ్ లుక్ లో కనిపించి మెప్పించింది.  


ఇప్పుడు ఇదే బాటలో టబును కూడా చూపిస్తున్నారు.  టబు కు సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయింది.  జయరాం కు జోడిగా నటిస్తోంది.  జయరాంతో కలిసి నడిచి వస్తున్న ఫోటో అది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్నది.  ఇందులో జయరాం, టబులు అల్లు అర్జున్ కు తల్లిదండ్రులుగా చేస్తున్నారు అనే టాక్ వస్తున్నది.  


అయితే, ఇది నిజమో కాదో ఇంకా తెలియదు.  పూజ హెగ్డే హీరోయిన్.  ఫాదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.  త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. మెగాస్టార్ బర్త్ డే రోజున ఈసినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది.  త్వరలోనే అన్ని విషయాలు బయటకు రానున్నాయి.  సుశాంత్, నివేత పేతురాజ్, నవదీప్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: