'ఒరు అదార్ లవ్' సినిమాలో ఒక్కసారి కన్నుగీటి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్ . ఆ సినిమా తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం శ్రీదేవి బంగ్లా. అయితే ఈ సినిమా టీజర్ లో హీరోయిన్ బాత్ టబ్‌ లో పడి చనిపోవడం వంటి సీన్లు ఉండటంతో అలనాటి హీరోయిన్ శ్రీదేవి నిజ జీవితానికి ఇది దగ్గరగా ఉందని శ్రీదేవి భర్త బోనీ కపూర్ సినిమా యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. కానీ, ఈ నోటీసులపై చిత్రబృందం స్పందించలేదు. 


దీంతో సినిమా విడుదలను ఆపేందుకు బోనీ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ''సినిమాలో ఏ సీన్ లను ఎలా చూపించాలన్నది వారి ఇష్టం కానీ టైటిల్‌లో మాత్రం శ్రీదేవి పేరు ఉండకూడదు'' అని బోనీ పట్టుబడుతున్నారట. మరో ప్రక్క ఈ సినిమాపై వివాదాలు ఉన్నప్పటికీ సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ ఇందులో గెస్ట్ రోల్ లో నటించేందుకు అంగీకరించారు. 


సినిమాకు, శ్రీదేవికి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నాకే నటించేందుకు అంగీకారం తెలిపానని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలోనూ బోణి కపూర్ సినిమా ఆపేందుకు ప్రయత్నించినప్పుడు ప్రియా వారియర్ గెట్టి షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఎవరి కథకు సంబంధం లేదు.. కథ గురించి తెలీకుండా తప్పు మాటలు మాట్లాడకండి.. ఎవరు ఎంత గింజుకున్నా ఈ సినిమా విడుదల అవుతుంది' అంటూ ప్రియా వారియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయినప్పట్టికీ శ్రీదేవి బంగ్లా చిత్రం మొదలైనప్పటి నుంచి వారానికి ఓ వివాదం ఆ సినిమాకి చుట్టుముడుతూనే ఉంది. మరి ఇన్ని విబేధాల మధ్య ఈ సినిమా విడుదల అవుతుందా ? లేదా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: