టాలీవుడ్ లో ఎంతో మంది మాలీవుడ్ బ్యూటీలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  మీరా జాస్మిన్, నయనతార, సాయిపల్లవి ఇలా ఎంతో మంది హీరోయిన్లు తెలుగు తెరపై తమ సత్తా చాటారు.  నాని హీరోగా నటించిన అలామొదలైంది మూవీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది.


తెలుగు సినిమాలతో పాటు,  మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ పాటలు పాడుతూ ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ కూడా చేసింది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి సినిమాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.  మెయిన్ హీరోయిన్ గానే కాకుండా సైడ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఆ మద్య నితిన్ హీరోగా నటించిన ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే తర్వాత ఏమిటో ఈ మాయ, మాలిని 22 అనే తెలుగు సినిమాలతో  రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది.


ఈ మద్య హీరోయిన్లు తెగ స్కిన్ షో చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, నిత్యామీనన్ మాత్రం గ్లామర్ పాత్రలకు నో చెబుతూ వస్తుంది. హీరోయిన్ నిత్యా మీనన్ ప్రజెంట్ జనరేషన్ నటీమణులతో పోల్చుకుంటే ఓ ప్రత్యేకత ఉంది. కేవలం నటన, అందమైన హావ భావాలతోనే నిత్య ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. నిత్యా మీనన్ ఇప్పటివరకు సౌత్ ఇండియన్ భాషలు, హిందీలో మొత్తం 49 సినిమాల్లో నటించింది.


త్వరలో అర్థ సెంచరీ పూర్తి చేసుకోబోతోంది. నిత్యామీనన్ నటించబోయే 50 వ చిత్రం 'అరం తిరుకల్పన'. మలయాళంలో తెరకెక్కే ఈ మూవీలో ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో నటిస్తున్నాడు.  అవకాశాలే ఆమెని వెతుక్కుంటూ రావడం మరో విశేషం. 2008 లో మలయాళీ మూవీతో తన కెరీర్ ని ప్రారంభించిన నిత్యా మీనన్ ప్రస్తుతం మలయాళీ మూవీతోనే 50 వ చిత్ర మైలురాయిని అందుకోబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: