గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ 'నిన్ను వీడని నీడను నేనే'తో హిట్ అందుకున్నాడు. కానీ సందీప్ కిషన్ కోరుకున్న హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే సాలిడ్ హిట్ కోసం కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 'తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్' సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ సినిమా. అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా చిత్రబృందం సినిమా విడుదలను నిర్ణయించింది. అక్టోబర్ లో సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు. అందుకే ఈ సారి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ 'తెనాలి రామకృష్ణ' సినిమాని చేస్తోన్నాడట. ముఖ్యంగా ఈ చిత్రంలో సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందని సమాచారం.
కాగా సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి హీరో చేసే పనులు.. ఆ పనులకు మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి, లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి తెనాలి రామకృష్ణ ఫుల్ గా నవ్విస్తాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓ కొరియన్ సినిమాకి కాపీ అని తెలుస్తోంది. పక్కా కామెడీగా నడిచే ఆ సినిమా నుండే ఈ సినిమా కథను కొట్టేశారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ జులై రెండో వారం కల్లా పూర్తి చేసుకొని.. ఆగష్టులో సినిమాని విడుదల చేయాలనుకున్నారు. అయితే సందీప్ కిషన్ ఇటీవలే షూటింగ్ లో గాయపడటంతో షెడ్యూల్ మొత్తం పోస్ట్ ఫోన్ చేశారు. మొత్తానికి అక్టోబర్ కి విడుదలకు సిద్ధం అయింది. మరి టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.