తమిళ స్టార్ హీరో  సూర్య  నటించిన 'ఎన్జీకే'  భారీ అంచనాల  మధ్య  ఇటీవల విడుదలై  డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరింది. దాంతో  గత కొంత కాలంగా సరైన హిట్ కోసం  ఎదురుచూస్తున్న సూర్య కు ఆ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఈసినిమా  తరువాత సూర్య నటించిన  చిత్రం కాప్పాన్.  మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.  అయితే  కోద్ది రోజుల క్రితం ఈసినిమా ట్రైలర్ ను వదలగా.. అనుకున్నంతగా  రెస్పాన్స్  తెచ్చుకోలేకపోయింది. దాంతో సూర్య ఖాతాలో మరో పరాజయం  చేరడం ఖాయమని అనుకున్నారు సినీ విశ్లేషకులు. అయితే తాజాగా కొంత మంది సినీ ప్రముఖల కోసం  తమిళనాడులో కాప్పాన్ స్పెషల్ షో వేశారట  మేకర్స్.  ఈ షో చూసిన వారు సినిమా బాగుందని , పక్కా హిట్ అవుతుందని  అంటున్నారు.  



ఒకేవేళ అదే జరిగితే  మొత్తానికి సూర్యకు  చాలా రోజుల తరువాత  విజయం దక్కుతుంది.  మరి ఏంజరుగుతుందో తెలియాలంటే ఈనెల 20వరుకు ఆగాల్సిందే.  ఈ చిత్రం  తెలుగులో బందోబస్త్ పేరుతో అదే రోజు విడుదలకానుంది.  ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో  విడుదలచేస్తున్నారు.  ఇక వరుస పరాజయాల కారణంగా  తెలుగులో సూర్య మార్కెట్ దారుణంగా పడిపోయింది మరి ఈ చిత్రం తోనైనా  సూర్య తన మార్కెట్ ను మెరుగుపరుచుకుంటాడో లేదో చూడాలి. రంగం ఫేమ్  కేవీ ఆనంద్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  సయేశా సైగల్ కథానాయికగా నటించగా మోహన్ లాల్ , ఆర్య , బోమన్ ఇరానీ  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: