గ్రామర్ ఎక్స్ పోజింగ్ విషయంలో ఎటువంటి షరతులు లేకుండా హీరోలకు దర్శకులకు సహకరించే రకుల్ ప్రీత్ కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు. టాలీవుడ్ టాప్ హీరోలు
మహేష్ ఎన్టీఆర్ చరణ్ లతో ఆమె నటించినా తిరిగి ఆమెతో నటించడానికి టాప్ హీరోలు ఎవరు పెద్దగ ఆసక్తి కనపరచడం లేదు.
దీనితో ఆమె సీనియర్ హీరోల వైపు టర్న్ తీసుకుని తెలుగులో నాగార్జునతో ‘మన్మధుడు 2’ హిందీలో
అజయ్ దేవగన్ తో ఒక బాలీవుడ్ మూవీలో నటించి సాధ్యమైనంత ఎక్స్ పోజింగ్ చేసినా ఆమెను బాలీవుడ్ ప్రేక్షకులు కానీ టాలీవుడ్ ప్రేక్షకులు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో కోలీవుడ్ లో అక్కడ హీరోలతో తన ప్రయత్నాలు కొనసాగించింది.
అయితే అక్కడ కూడ ఆమెకు చెప్పుకోతగ్గ క్రేజ్ ఏర్పడలేదు. ప్రస్తుతం ఆమె
నితిన్ తో చంద్ర
శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడ లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆమె
రామ్ చరణ్ తో చేస్తున్న రాయబారాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో
చిరంజీవి నటిస్తున్న మూవీలో ఇద్దరి హీరోయిన్స్ కు అవకాశం ఉంది. ఈ మూవీలో తనకు సెకండ్ హీరోయిన్ పాత్ర ఇచ్చినా తనకు అభ్యంతరం లేదు పారితోషికం గురించి కూడ తాను పట్టించుకొను అని ఆమె చరణ్ తో చేస్తున్న రాయబారాలు కొరటాల దృష్టి వరకు వెళ్ళినట్లు టాక్. అయితే ఈ రాయబారాలకు అటు చరణ్ కాని ఇటు కొరటాల కాని స్పందించడం లేదు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. దీనితో రకుల్ ప్రీత్ అటు సీనియర్ హీరోలకు ఇటు యంగ్ హీరోలకు ఎవరికీ ఆసక్తి కనపరచని హీరోయిన్ గా మారిపోయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..