స్టార్ హీరోలకు ఎవరి ఫాలోయింగ్ వారిది.. ఎవరి క్రేజ్ వారిది. అయితే ఫ్యాన్స్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నా ఫ్యాన్స్ మధ్య మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు అందరికి తెలిసినవే. వీటిని స్టార్స్ కూడా వద్దని చెబుతారు. హీరోల మధ్య సఖ్యత ఉందా అంటే పైకి ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం చేసేది చేస్తుంటారని తెలుస్తుంది.


ఫ్యాన్స్ ముందు మేమంతా ఒకటే.. కలిసి ఉంటాం.. మాట్లాడుకుంటాం అని చెప్పే స్టార్స్ సినిమాల రిలీజ్ విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్ షిప్ పక్కన పెడతారు. ఫెస్టివల్ సీజన్ వచ్చింది అంటే చాలు మా సినిమా రిలీజ్ అంటే మా సినిమా రిలీజ్ అని హడావిడి చేస్తారు. లేటెస్ట్ గా 2020 సంక్రాంతికి మహేష్, బన్ని సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేశారు.


అయితే జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ అనుకోవడం ఆశ్చర్యకరం. మరి నిర్మాతలు, దర్శకులు చర్చించుకున్నారో లేదో కాని మహేష్ సరిలేరు నీకెవ్వరు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి సఖ్యత ఏదో సినిమా రిలీజ్ విషయంలో కూడా చూపిస్తే బాగుంటుంది. అనవసరంగా రెండు సినిమాలకు ఫస్ట్ డే కలక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశాం ఉంది.


ఏది ఏమైనా పైకి మాత్రమే హీరోలు కలిసి ఉన్నట్టుగా నటిస్తారు.. సినిమా రిలీజ్ టైంలో మాత్రం ఇలా పోటీపడతారని తెలుస్తుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తుండగా.. బన్ని అల వైకుంఠపురములో త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి. మహేష్ సరిలేరు నీకెవ్వరులో రష్మిక.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: