తెలుగు లో ఒకప్పుడు టెలివిజన్ లో కేవలం వార్తలు, చిన్న కామెడీ కార్యక్రమాలు..వంటా వార్పు  కార్యక్రమాలు మాత్రమే అలరించేవి.  అయితే యాంకర్ ఓంకార్ టెలివిజన్ రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు తీసుకు వచ్చారు.  చిన్న పిల్లలతో ‘ఆట’ డ్యాన్స్ షోతో బాగా పాపులర్ అయిన యాంకర్ ఓంకార్, గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.  ‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడ్డారు.  


ఇక హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీస్ కి మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో ఓంకార్ ‘రాజుగారి గది’ సినిమా తీశారు.   ఈ మూవీ హర్రర్, కామెడీ తో పాటు ఆర్గాన్స్ డొనేషన్ పై మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.  ఆ తరువాత 'రాజుగారి గది 2' సినిమాను భారీగా తీసినా ఆశించినస్థాయిలో అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన 'రాజుగారి గది 3' సినిమాను రూపొందించాడు. అశ్విన్ ప్రధాన పాత్రధారిగానే ఈ సినిమా నిర్మితమైంది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.


ఈ మద్య రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది.  హర్రర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ అవికా గోర్ దయ్యంగా నటిస్తుంది.  ఈ మూవీ టీజర్ చూసిన వారు సినిమాపై అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ బిజీలో ఉంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ, 'రాజుగారి గది 2' సినిమాలో కామెడీ పాళ్లు తగ్గాయనే విమర్శ వచ్చింది. అందువలన ఈ సినిమాలో కామెడీ డోస్ ఎక్కువగానే ఉండేలా చూశాము. ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఈ మూవీలో మొదట తమన్నా అనుకున్నాం..ముహూర్తం షాట్ కి కూడా వచ్చారు.  మొదట కీలకమైన పాత్ర కోసం ముందుగా తమన్నాను అనుకున్నప్పటికీ, ఆమె డేట్స్ కుదరకపోవడం వలన అవికా గోర్ ను తీసుకున్నాము. ఈ పాత్రకి అవికా కరెక్ట్ అనిపించింది  అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: