వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కూడా యాడ్స్ రంగంలో సౌత్ ఇండస్ట్రీ లో ఎవరూ ఊహించని విధంగా రాణిస్తున్నాడు మహేష్. ఇలా అనేక రంగాలలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని రాణిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు విజయవాడ నగరంలో పర్యటించడం జరిగింది. విజయవాడలో ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ షోరూం ఓపెనింగ్ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యాడు. సాధారణంగా విజయవాడ నగరంలో మహేష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో మహేష్ విజయవాడ నగరానికి రావడంతో ఓపెనింగ్ చేసే జువెల్లరీ షోరూం దగ్గర కిక్కిరిసి వాతావరణం నెలకొంది. మహేష్ బాబు ని చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు.


దీంతో భద్రతాసిబ్బంది పోలీసులు కూడా వారిని కట్టడి చేయడానికి చాలా అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. విజయవాడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. విజయవాడలో తాను నటించిన ఎన్నో చిత్రాలు ఈవెంట్స్ జరిగాయని మహేష్ పేర్కొన్నాడు.ఈ సందర్భంగా మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్ర గురించి ప్రస్తావించాడు. నా కొత్త చిత్రం సంక్రాంతికి విడుదుల కాబోతోంది. సరిలేరు నీకెవ్వరు అభిమానులు గర్వపడేలా ఉంటుందని మరోసారి మీరు కాలర్ ఎగరవేయడం గ్యారెంటీ అన్నట్టుగా అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు తెలిపాడు. దీంతో మహేష్ బాబు చేసిన కామెంట్లు అక్కడ ఉన్న అభిమానులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: