విజయవాడలో ఒక ప్రముఖ జ్యులరీస్ షో రూమ్ భీమ జ్యుయలరీ షో రూమ్ ని ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ప్రారంభించారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు షో రూమ్ వద్దకు భారీగా వచ్చిన అభిమానులు. మహేష్ బాబు రాకకోసం బందరు రోడ్ ని ఆక్రమించిన నిర్వాహకులు. మహేష్ బాబు రాకతో బందరు రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కాగా 1925 లో మొదటి జ్యుయలరీ షో రూమ్ ను ప్రారంభించిన సంస్థ. దేశవ్యాప్తంగా 45 బ్రాంచ్లు కలిగిన  జ్యులరి సంస్థ. సినీనటుడు , మహేష్ బాబు ఈ సందర్బంగా మాట్లాడారు. నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా  నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.



నా సినిమాలకు సంభందించి ఎక్కువ ఫంక్షన్ష్ విజయవాడలో నిర్వహించమని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. నా కొత్త  సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అభిమానులు గర్వపడేలా నా కొత్త సినిమా ఉంటుంది. బెజవాడ అభిమాన సంద్రంలో మహేశ్ బాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విజయవాడ వచ్చిన మహేశ్ బాబు భీమ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవం చేశారు.  మహేశ్ ను చూసేందుకు పోటెత్తిన అభిమానులు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఆయన పబ్లిక్ లోకి వస్తే ఇసుకేస్తే రాలనంతగా జనాలు వస్తారు. తాజాగా విజయవాడలో ఆ విషయం నిరూపితమైంది.



ఎంజీ రోడ్డులో కొత్తగా స్థాపించిన భీమ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు విచ్చేశారు. ఆయన రాకతో అభిమానులు పోటెత్తారు.షోరూం పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. అభిమానులను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాల్సి వచ్చింది. భీమ జ్యుయెలరీ సంస్థ త్వరగా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బెజవాడ తనకు ఎప్పుడూ ప్రత్యేకం అని, తన కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి  వస్తోందని, ప్రతి ఒక్కరూ చూడాలని మహేశ్ బాబు అభిమానులను కోరారు


మరింత సమాచారం తెలుసుకోండి: