నేచురల్ స్టార్ నాని హోస్టుగా చేసిన  బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఇంటి సభ్యులందరికి గారాల పట్టిగా పేరు తెచ్చుకుంది దీప్తి సునైనా మీకు గుర్తుందా?  చబ్బీ చబ్బీ లుక్స్ తో బబ్లీగా కనిపిస్తూనే బోయ్స్ ని తెగ కవ్వించింది దీప్తి. తాజాగా దీప్తి తన ఫ్యాన్స్‌కు ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇటీవల తన తొలి చిత్రం ‘అలియా ఖాన్’ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.


ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి చూస్తే.. పాకిస్థాన్ ఫిమేల్ యాక్టివిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్ మలాలా యూసఫ్‌జాయ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి జిఎస్ రాజ్ కుమార్ దర్శకుడు కాగా.. ఛోటా థియేటర్ బ్యానర్‌పై తేజేస్కర్ రెడ్డి, భరత్ సోమి కలిసి నిర్మాతగా వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తామన్నారు.


ఈ అమ్మడు బిగ్ బాస్ ముగిశాక ఎటు పోయిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అన్నిటికీ త్వరలోనే ఓ క్లారిటీ రానుందని తన ఫేస్ బుక్ చూస్తే అర్థమైంది మల్లి . త్వరలో దీప్తి కథానాయికగా అభిమానుల ముందుకు రాబోతోంది అని అందరికి తేలిపోతుంది సోషల్ మీడియా చూసాక. ఈ  సినిమా టైటిల్ `ఆలియా ఖాన్`. తనే స్వయంగా ఫేస్ బుక్ లో పోస్టర్ ని రివీల్ చేయడం జరిగింది. ఇంతకీ ఎలాంటి కథలో నటించబోతోంది అంటే ఓ బయోపిక్ లో నటించనుందని తెలిసిపోతుంది.


ఫీమేల్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి పోరాటం సాగిస్తున్న ప్రముఖురాలి జీవితకథలో పోషిస్తున్న అంటూ దీప్తి స్వయంగా తెలియచేసారు. ఫేస్ బుక్ టైమ్ లైన్ లో ఈ విషయాన్ని తెలిపింది దీప్తి. తను ఇచ్చిన హింటును బట్టి పాకిస్తాన్ కి చెందిన ఫీమేల్ యాక్టివిస్ట్ .. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జై జీవితకథ ఆధారంగా అనుగుణంగా ఈ సినిమా వస్తుంది అని భావిస్తున్నారు అందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: