గత ఏడాది  ప్రారంభంలో ఛలో తో సూపర్  హిట్ కొట్టిన యంగ్ హీరో నాగ శౌర్య ఆతరువాత హ్యాట్రిక్  డిజాస్టర్లును చవి చూశాడు. అయితే జయాపజయాలతో సంబందం లేకుండా ఈ హీరో వరుసగా  సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీగా వున్నాడు.  అందులో భాగంగా ఇటీవల నూతన దర్శకుడు రమణ తేజ డైరెక్షన్ లో ఓ సినిమా ను పూర్తి చేశాడు  నాగశౌర్య.  తన సొంత బ్యానర్ ఐరా  క్రియేషన్స్ నిర్మిస్తున్నఈ చిత్రం లో మెహ్రీన్ కథానాయికగా నటిస్తుంది.  శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఇంకా ఈచిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు.  ఇక ఈ చిత్రం తో తోపాటు   తనకు  
ఊహలు గుస గుస లాడే లాంటి హిట్ ఇచ్చిన  దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో  శౌర్య మరో సినిమా చేస్తున్నాడు. 


ఇదిలా ఉంటే  ఇటీవల నాగశౌర్య  ఓ లేడీ  డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడు.  నూతన దర్శకురాలు  లక్ష్మి సౌజన్య  డైరెక్షన్ లో  నటించడానికి శౌర్య ఒకే చెప్పాడు.   ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది.  అక్టోబర్ నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ కానుండగా  వచ్చే ఏడాది మే  లో   సినిమా ను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు  వెలుబడనున్నాయి.


ఇక ఇప్పుడు  మరో కొత్త చిత్రానికి  కూడాసైన్ చేశాడు నాగశౌర్య. గత ఏడాది సుమంత్  హీరోగా సుబ్రహ్మణ్యపురం అనే చిత్రాన్ని తెరకెక్కించిన  యంగ్ డైరెక్టర్  సంతోష్ జాగర్లపూడి, ఇప్పుడు నాగశౌర్య  ను డైరెక్ట్ చేయనున్నాడు. వీరి ఇద్దరి కాంబినేషన్ లో రానున్న చిత్రం ఈ రోజు లాంఛ్ అయ్యింది.  ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత  శరత్ మరార్ సంయుక్తం గా ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: