యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి బేనర్స్‌పై నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పూజా  కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లుఅరవింద్‌ క్లాప్‌ నివ్వగా, సూపర్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి సన్నివేశాన్నిదేవుడి పటాలపై చిత్రీకరించారు దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి. ఈ సందర్భంగా..


ప్రముఖ నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ - ''నార్త్‌ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ ప్రై.లి, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి పై నారయణదాస్‌ నారంగ్‌, రామ్‌ మోహన్‌ రావు గార్లతో కలిసి నాగశౌర్య హీరోగా ఈ చిత్రం నిర్మిస్తున్నాను.  'సుబ్రహ్మణ్యపురం' ఫేమ్ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీ. కథ అద్భుతంగా ఉంది  అలాగే సంతోష్‌ ప్రామిసింగ్‌ డైరెక్టర్‌. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం'' అన్నారు.


యంగ్‌ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ''ఏషియన్‌ సునీల్‌ గారు. శరత్‌ మరార్‌ గారి కాంబినేషన్‌లో ఈ చిత్రం ప్రారంభమవడం హ్యాపీగా ఉంది. సంతోష్‌ సెకండ్‌ ఫిలిమ్‌. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్‌ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ - ''ఈ చిత్రం ఒక స్పోర్ట్స్‌ డ్రామా. ఒక ఇమాజినరీ బయోపిక్‌లా ఉంటుంది. నాకు తప్పకుండా మైలేజ్‌ ఇచ్చే మూవీ అవుతుంది. ఈ సినిమాలో మీరు సరికొత్త నాగశౌర్యని చూస్తారు 'అన్నారు.


సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ రెడ్డి మాట్లాడుతూ - ''నేను నాగశౌర్య గారి 'అశ్వద్ధామ' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాను. ఈ సినిమాలో మళ్ళీ అవకాశం రావడం హ్యాపీగా ఉంది'' అన్నారు.


నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ : మనోజ్‌ రెడ్డి, నిర్మాతలు: నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌ రావు, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి.


మరింత సమాచారం తెలుసుకోండి: