స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ - కమల్‌ హాసన్‌ ల కలయికలో 1996లో  వచ్చిన  భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు  శంకర్‌  భారతీయుడు సీక్వెల్‌ ను  రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. అయితే బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో అజయ్ దేవగన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో అనిల్ కపూర్ విలన్ రోల్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది.  పైగా అనిల్ కపూర్ చెన్నై వెళ్లినప్పుడు శంకర్ ను కలవడం, ఆ ఫొటోలు బయటకు రావడంతో ఈ వార్టలకు మరింత బలం చేకూరింది.  కానీ ప్రతినాయకుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తాన్నారు. కాగా తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు వచ్చే షెడ్యూల్ లో అజేయ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.   

ఇక ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో   టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్‌  ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.  అయితే ఆమెది భారతీయుడు సీక్వెల్‌ లో  కీల‌క పాత్ర‌ అట. అందుకే ఆమె పాత్రలో   గ్యాంగ్ లీడర్ బ్యూటీ  ప్రియాంకా అరుళ్ మోహన్ ను తీసుకోవాలని అనుకున్నా.. ఆమె స్థానంలో శృతి శర్మను తీసుకున్నారట.  శృతి శర్మ  రీసెంట్ గా  ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ అందుకుంది. కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో  జరగబోయే  షెడ్యూల్ లో  శృతి శర్మ  కూడా షూట్ లో పాల్గొంటుందట. కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో  హీరోయిన్‌ గా  కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ కూడా నటించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే  ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో  కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. 

 అలాగే ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్  కూడా  భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషించనున్నాడు. అనిరుద్ రవిచందర్  సంగీతం అందిస్తున్న  ఈ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది.  2020లో ఈ సినిమా  విడుదలకానుంది.  ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు. మరి ఈ సినిమానైనా అటు కమల్ కి  ఇటు శంకర్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.    

  


మరింత సమాచారం తెలుసుకోండి: