మహేష్ ప్రస్తుతం నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ చివరి దశకు చేరు కోవడంతో మహేష్ తాను నటించబోయే తదుపరి మూవీ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ  మూవీస్ చేస్తున్న రాయబారాలకు మహేష్ బుట్టలో పడిపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. 
కేజీ ఎఫ్’ సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఒకవైపు ప్రస్తుతం ‘కేజీ ఎఫ్’ పార్ట్ 2ను చేస్తూ తెలుగులో ఒక డైరెక్ట్ సినిమాను చేయడానికి మైత్రీ మూవీస్ సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఒక పవర్ ఫుల్ స్టొరీని ప్రశాంత్ నీల్ తయారు చేసాడు అని తెలుస్తోంది. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ కథకు జూనియర్ ఎన్టీఆర్ అన్ని విధాల సరిపోతాడు అన్నఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ ఈ కథను జూనియర్ కు వినిపించి అతడి నుండి ప్రశంసలు పొందినా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ వచ్చే ఏడాది మధ్య వరకు జరిగే నేపధ్యంలో జూనియర్ ఈ మూవీ విషయంలో కొంత సమయం అడిగినట్లు టాక్. అయితే అంతవరకు ఆగే ఉద్దేశ్యం లేని ప్రశాంత్ నీల్ ఇదే కథను ఇప్పుడు మహేష్ వైపుకు టర్న్ చేయడంతో మహేష్ ఈ మూవీకి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహేష్ ప్రశాంత్ నీల్ ల ప్రాజెక్ట్ మైత్రీ మూవీస్ సారధ్యంలో పట్టాలు ఎక్కుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కు ఉన్న ఇమేజ్ రీత్యా అతడి సినిమాలలో నటించే హీరోలు చాల సులువుగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక మంచి అవకాశాన్ని జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణం ఆలస్యం అవ్వడం వల్ల పోగొట్టుకుంటున్నాడు అంటూ తారక్ అభిమానులు అసహనంలో ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: