తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 షో మరికొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మద్య ఎలాంటి గొడవలు తీవ్ర స్థాయిలో జరగలేదు.  కాకపోతే గత కొన్ని రోజులుగా బాబా భాస్కర్ వర్సెస్ వితిక మద్య మాత్రం బీభత్సమైన పోటీ నడుస్తుంది.  ఎవరికి వారే గేమ్, టాస్క్ విషయంలో నేనంటే నేను అన్న రీతిలో పోటీ పడుతున్నారు.  నిన్నటి ఎపిసోడ్ లో బాబా భాస్కర్ స్మోకింగ్ రూమ్ కి వెళ్లి వరుణ్ సందేష్ తో ముచ్చటించాడు. ఈసారి ఎలిమినేషన్ తానే అవుతానని..లేదంటే స్వచ్చందంగానైనా ఎలిమినేట్ అవుతానని అసహనం వ్యక్తం చేశాడు.  ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘టాపర్ ఆఫ్ ది హౌస్’ అనే టాస్క్ ఇచ్చారు. 


ఈ టాస్క్ ప్రకారం ఇంట్లో ఉన్న ఏడుగురు సభ్యులను చిట్టీలు తీయమని చెప్పాడు. ఆ చిట్టీలో వచ్చిన నెంబర్ల ప్రకారం ఏడు స్థానాల్లో నిలబడాలి.  అయితే బిగ్ బాస్ ఇచ్చిన నెంబర్ మార్చుకోవాలంటే తగిన కారణం చెప్పి ఇంటి సభ్యులతో ఒకే అనిపించుకుంటే..మార్చుకోవొచ్చు. ఈ టాస్క్ లో మొదటి స్థానం బాబా భాస్కర్ కి వచ్చింది. రెండో స్థానం రాహూల్, మూడో స్థానం వరుణ్ సందేశ్, నాలుగో స్థానం  అలీ, ఐదో స్థానం శివజ్యోతి,ఆరో స్థానం వితిక చివరి స్థానం శ్రీముఖి కి వచ్చింది. అయితే మొదటి స్థానం కోసం బాబా భాస్కర్ తో వితిక పెద్ద గొడవనే చేసింది.

తాను మొదటి స్థానానికి అర్హురాలినని తనకు ఆ స్థానం ఇవ్వాలని చెప్పింది..కానీ బాబా భాస్కర్ కూడా ఎక్కడా తగ్గలేదు..వితికకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఇక గత్యంతరం లేక వరుణ్ తన మూడో స్థానాన్ని వితికకు ఇచ్చాడు. దీనిపై శివజ్యోతి అభ్యంతరం చెప్పింది..మూడో స్థానం ఆమెకు ఎలా ఇస్తారు. భర్త అయితే మాత్రం మరీ ఇంత త్యాగం గేమ్ లో ఉండకూడదు..గేమ్ ని గేమ్ లాగే చూడాలని వాదించింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో తామే ది బెస్ట్ అనే ఎవరికి వారే వాదించుకున్నారు. చివరిగా ఇంట్లో ఉన్న వరుణ్, వితికా,రాహుల్, శివజ్యోతి,బాబా భాస్కర్,అలీ రెజా,శ్రీముఖి ఎలిమినేట్ అయ్యారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: