తెలుగు లో బాలీవుడ్ బ్యూటీలు ఎంతో మంది వస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో లో పవన్ కళ్యాణ్‌కు జోడీగా ‘బద్రి’, మహేష్ బాబుకు జోడీగా ‘నాని’, ఎన్టీఆర్‌కు జోడీగా ‘నరసింహుడు’, బాలకృష్ణ‌కు జోడీగా  ‘పరమవీర చక్ర’ లాంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ లుక్ తో స్కిన్ షో చేస్తూ అప్పట్లో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. 

తెలుగు లో మంచి ఛాన్సులు వస్తున్నా..బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.  చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న అమీషా పటేల్ పై రాంచీ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అమీషా పటేల్‌పై  చెక్ బౌన్స్ కేసు నమోదైంది.  కాగా, బాధితుడి వివరణ ప్రకారం..  ఓ సినిమా కోసం అమీషా తన బిజినెస్ పార్ట్‌నర్‌తో కలిసి నా నుంచి రూ.2.50 కోట్లు తీసుకున్నారు. 2018లో సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఫిలిమ్ రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్ లో భాగస్వామ్యం ఇస్తానని హామీ ఇచ్చిందట. 

కానీ, ఆ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నా డబ్బు నాకిచ్చేయమని అమీషాను అడిగాను. ఆమె రూ.3 కోట్ల విలువైన చెక్ ఇచ్చింది. అయితే బ్యాంక్ లో వేయగా అది బౌన్స్ అయింది.  దాంతో గతేడాది రాంచి డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు పెట్టాను. కోర్టు నుంచి ఎన్ని సమన్లు వచ్చినా అమీషా స్పందించింది లేదు. అందుకే కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అని తెలిపాడు.  నాలుగు పదుల వయసులోనూ అమీషా తన అందచందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. కానీ ఆమెకు నచ్చిన పాత్రలు రావడంలేదని కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: