సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ ప్రస్తుతం టాప్ కోలీవుడ్ స్టార్స్ లో ఒకడు. కొలవరి పాటతో దేశవ్యాప్తంగా ఇమెజ్ పొందిన ధనుష్ కొన్ని నెలల క్రితం తాను బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘రంజానా’ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తాను చాటుకున్నాడు. అటువంటి ధనుష్ తో ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్న ఒక కోలీవుడ్ దర్శక నిర్మాతలకు ధనుష్ సినిమాలో లిప్ లాకింగ్ సీన్ పెట్టాలని అనిపించినదట. అయితే ఆశ్చర్యకరంగా ధనుష్ తో ఆన్ స్క్రీన్ పై పెదవులు కలపడానికి చాలామంది హీరోయిన్లు ఇష్టపడలేదట.  అయితే అనుకోకుండా ఒక హీరోయిన్ ముందుకు వచ్చి ఆ ఛాన్స్ ను పట్టేయడమే కాకుండా ఏకంగా ఆసీన్ లో నటించి నందుకు 50 లక్షల పారితోషికాన్ని కొట్టేసిందని టాక్, ఆమె మరెవరో కాదు దీక్షాసేథ్‌. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా దీక్షాసేథ్‌కి క‌ల‌సి రాలేదు. ర‌వితేజ‌, గోపీచంద్ స‌ర‌స‌న న‌టించినా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అయితేనే ఈమధ్యనే బాలీవుడ్‌లో ఒక ఆఫ‌ర్ అందుకొంది. అర్మాన్ జైన్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అటు త‌మిళంలోనూ ఛాన్సులొస్తున్నాయి ఈ నేపధ్యంలో ధ‌నుష్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించడమే కాకుండా లిప్ లాక్ సీన్ కు కూడా ఓకె చెప్పేసింది.  ధ‌నుష్ లాంటి స్టార్ హీరోతో చాన్స్ కొట్టేసినందుకు ఆనంద పడిపోతూ ఈముద్దు గుమ్మ లిప్‌లాక్‌ల గురించి అడిగితే మాత్రం సినిమా అన్నాక ముద్దులుండ‌వా అంటు గారాలు పోతోంది దీక్షాసేథ్‌.   

మరింత సమాచారం తెలుసుకోండి: