బాహుబలి ... భల్లాలదేవుడు దగ్గుబాటి రానా ఈ మధ్య చాల చిక్కిపోయి కనిపిస్తున్నాడు . దాంతో రానా ఆరోగ్య పరిస్థితిపై అందరికి అనుమానాలే . ఎవరికీ తోచినట్లు వారు ఊహించుకుంటున్నారు . సోషల్ మీడియా లో అయితే ఏకంగా రానా  కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడని , అమెరికా కు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడని ఇలా రక, రకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి . ఆ నోటా , ఈ నోటా తన ఆరోగ్యం పై జరుగుతోన్న చర్చ గురించి విన్న రానా ... తనకు ఏమి కాలేదని తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పినప్పటికీ కూడా పుకార్లు , షికార్లు చేస్తూనే ఉన్నాయి .

ఈ నేపధ్యం లో రానా ఆరోగ్యం గురించి ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇటీవల ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించాడు . రానా కు చిన్నప్పటి నుంచి కంటి సమస్య ఉందని , దానికి అప్పట్లోనే చికిత్స చేయించాలని చూసిన , చిన్నతనం లో చికిత్స చేయడం కరెక్టు కాదన్నా డాక్టర్ల సలహాతో వాయిదా వేసుకున్నట్లు వివరించాడు . ఇటీవల రానా కంటికి శస్త్ర చికిత్స జరిగిందని , శస్త్ర చికిత్స జరిగిన అనంతరం ఎక్కువగా వత్తిడి గురికావడం వల్ల రక్తపోటు (బీపీ ) కూడా వచ్చిందని చెప్పాడు . బీపీ అటాక్ కావడం వల్లే కాసింత రానా నిరసించడాని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు .

తన కుమారుడికి ఏమి కాలేదన్న ఆయన , త్వరలోనే పాత రానా ను చూస్తారని అంటున్నాడు . రానా ఆరోగ్య పరిస్థితి పై ఇప్పటికైన సోషల్ మీడియా లో ఊహాగానాలు ఆగుతాయో లేదో చూడాలి మరి . రానా నటించిన హిందీ సినిమా హౌస్ ఫుల్ -4  విడుదలకు రెడీ గా ఉంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: