బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గతంలో విజయ్ దేవరకొండను విపరీతంగావిమర్శించింది. ముఖ్యంగా గతంలో ‘అర్జు రెడ్డి’ ట్రైలర్ విడుదలైన సమయంలో ఆ ట్రైలర్ లోని బూతు పదం వాడకం పై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా అప్పట్లో అనేక ఛానెల్స్ ఆ విషయంమై ఏర్పాటు చేసిన చర్చాల కార్యక్రమాలలో విజయ్ దేవర కొండను విమర్శిస్తూ చాలా నెగిటివ్ కామెంట్స్ కూడ చేసింది. 

ఈ విషయమై అప్పట్లో  అనసూయను విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్రంగా టార్గెట్ చేసారు. ఆ తరువాత ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ ను హీరోగా చేసి నిర్మిస్తున్న ‘మీకు మాత్రమే చెప్తా’  మూవీలో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. 

ఈమె పాత్ర ఇంచుమించు ఈ మూవీలో హీరోయిన్ పాత్ర రేంజ్ లో ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. వచ్చేనెల నవంబర్ 1న విదుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ త్వరలో హైదరాబాద్ లో తోంది. విజయ్ తో ఒకే వేదిక పైకి రాబోతున్న అనసూయ విజయ్ ను అలనాడు విమర్శించిన నోటితో నేడు ఎలా ప్రశంసలు కురిపిస్తుంది అంటూ కొందరు విజయ్ వీరాభిమానులు అనసూయను చిలిపిగా ప్రశ్నిస్తున్నారు. 

అయితే ఎలాంటి నెగిటివ్ విషయాన్ని అయినా పాజిటివ్ గా మార్చుకోవడంతో మంచి సమర్దురాలైన అనసూయ విజయ్ వీరాభిమానులను కూడ చాల తెలివిగా మేనేజ్ చేయగలదు అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ఇది ఇలాండగా విజయ్ నిర్మించిన ఈ మూవీ ఫలితం అంత ఆశాజనకంగా ఉండక పోవచ్చు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఈ మూవీ ట్రైలర్ యూత్ కు బాగా కనెక్ట్ కాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: