కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి  దర్శకత్వంలో  సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న సినిమా  'తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్'.  కాగా  ఈ చిత్రం  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను త్వరలో పూర్తి   చేసుకోనుంది.   అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని  నవంబర్  లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  ఇక గత కొంత కాలంగా  సరైన సక్సెస్ లేక  ఇబ్బంది పడుతున్న  సందీప్ కిషన్ ఎట్టకేలకూ 'నిన్ను వీడని నీడను నేనే'తో హిట్ అందుకున్నాడు. కానీ సందీప్ కిషన్ కోరుకున్న హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే సాలిడ్ హిట్ కోసం ఈ కామెడీ సినిమా చేస్తున్నాడట.   ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది.  నిజానికి  అక్టోబర్  లోనే  ఈ  సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నా.. సందీప్ కిషన్ కి షూటింగ్ లో గాయం అవ్వడం కారణంగా సినిమా రిలీజ్ డేట్ ను నవంబర్ కి పోస్ట్ ఫోన్ చేశారు. ఇక  'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి ఫుల్  ఎంటర్ టైనర్ తో మంచి  హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు.  అందుకే ఈ సారి  ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలని ఈ  సినిమాని చేస్తోన్నాడట.  ముఖ్యంగా  ఈ చిత్రంలో  సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందని సమాచారం. 

కాగా సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా  హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల  నుండి తప్పించుకోవడానికి  హీరో చేసే పనులు.. ఆ పనులకు  మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి,  లాంటి  అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి  తెనాలి రామకృష్ణ ఫుల్ గా నవ్విస్తాడని తెలుస్తోంది. ఇక  ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన  హన్సిక కథానాయకిగా నటిస్తోంది. అలాగే  రాధికా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఓ కీలక పాత్ర చేస్తున్నారని సమాచారం. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇది అతనికి 75వ చిత్రం కావడం విశేషం.  ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది  మొత్తానికి ఈ సినిమా నవంబర్ కి విడుదలకు సిద్ధం కానుంది.  మరి సందీప్ కిషన్ సక్సెస్  టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: