అయితే ఈ చిత్రం ఫుల్ రన్ లో మంచి లాభాలను తీసుకొచ్చేదే కానీ ఈ సినిమా విడుదలైన 12రోజులకే సైరా విడుదలకావడంతో కలెక్షన్స్ విషయంలో దెబ్బపడింది. అలా కాకుండా గద్దలకొండ గణేష్ను ఇంకొంచెం ముందు విడుదలచేసే ఉంటే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేదే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు రీమేక్ గా రూపొందిన ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్, సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి నటించగా వీరికి జోడిగా పూజాహెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఈచిత్రంతో ఈఏడాది వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ సంక్రాంతికి ఎఫ్2 తో వరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.