మెగాస్టార్ రీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేశారు. పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 తో తన స్టామినా ఏమాత్రం రగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. 151వ సినిమా సైరా సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్. అయితే ఎంట్రీ తర్వాత చేసిన రెండు సినిమాలు కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాతగా చేశాడు. 

 

 మెగాస్టార్ సినిమా అంటే అల్లు అరవింద్ నిర్మాత అని ఫిక్స్ అయిపోయారు మెగా ఫ్యాన్స్. కానీ రీ ఎంట్రీ తర్వాత అల్లు అరవింద్ కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. 152 సినిమా అల్లు అరవింద్ నిర్మాణంలో ఉంటుందని ఇంతకుముందు చెప్పాడు చిరంజీవి. కానీ రీసెంట్ గా 150 రెండో సినిమా కూడా రామ్ చరణ్ నిర్మాణంలోనే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. మ్యాట్ ని మూవీస్ భాగస్వామ్యంలో రామ్ చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

 

 నిర్మాతగా అల్లు అరవింద్ ఇప్పటికీ మంచి ఫామ్లో ఉన్నా మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆయనకు చాన్స్ ఇవ్వట్లేదు. ఓ రకంగా అల్లు అరవింద్ కి చిరంజీవి అన్యాయం చేస్తున్నాడనే చెప్పాలి. 152 సినిమా ఫిక్స్ అయింది. 153 వ సినిమా అయినా సరే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో చేస్తాడేమో చూడాలి. 

 

మాములుగా అయితే కొడుకుని ప్రమోట్ చేస్తూ తండ్రులు నిర్మాతలుగా మారుతారు కాని తండ్రి కోసం నిర్మాతగా మారిన కొడుకు మాత్రం రామ్ చరణ్ మాత్రమే ఉన్నాడని అనిపిస్తుంది. చిరు 152వ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తుంది. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మరి ఈసినిమా మిస్సైన చిరు తన తర్వాత విషయంలో అయినా అల్లు అరవింద్ తో కలిసి పనిచేస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: