వర్మ స్కూల్ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా సక్సెస్ తరువాత ప్రస్తుతం `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు వర్మ. అంతేకాక ఈ సినిమాతో పాటు వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి సైలెంట్గా రిలీజ్కు రెడీ అవుతోంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక).
నైనా కథానాయికగా,
సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు.
అగస్త్య మంజు దర్శకుడు. లోగడ లక్ష్మీస్
ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు
అగస్త్య మంజు సహ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న చిత్రమిది. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కి విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లోని మొదటి సింగిల్ (పాట)ను ఇదే నెల 20 నుంచి 25 లోపు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అలాగే ప్రీ రిలీజ్ వేడుకలలో భాగంగా ఈ నెలాఖరులో వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లలోని కాలేజీలకు చిత్రబృందం వెళ్లి సందడి చేయనున్నది. రొమాంటిక్
ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఆకట్టుకోనున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
ఈ చిత్రానికి పాటలను సిరా
శ్రీ అందించగా...సంగీతాన్ని
రవి శంకర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం:
అగస్త్య మంజు. ట్రైలర్లో ప్రధానంగా రొమాన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసినా సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ప్రేమ, విరహం లాంటి ఎమోషన్స్ హై రేంజ్లో చూపించనున్నారు.