సినిమాల ప్రభావం సామాన్య ప్రేక్షకుల పైన మాత్రమే కాకుండా సెలబ్రిటీల పై కూడ ఎలా ఉంటుందో తెలియ చేసే మరో ఆసక్తికర సంఘటన లేటెస్ట్ గా జరిగింది. బాలీవుడ్ రికార్డులను క్రియేట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ ను చూసి ప్రేమలో విపలం అయినందుకు హత్యలు చేసిన ఒక సెలెబ్రిటీ జీవితానకి సంబంధించిన వాస్తవ సంఘటన వెలుగులోకి రావడంతో ఈ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి షాక్ అవడమే కాకుండా ఏకంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఉత్తర ప్రదేశ్ కు చెందిన టిక్ టాక్ స్టార్ జానీ దాదా అలియాస్ అశ్వినీ కుమార్ కు ఉత్తర ప్రదేశ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. రాజకీయ నాయకుల దగ్గర నుండి సామాన్యుల వరకు ఇతడి టిక్ టాక్ వీడియోలను అక్కడ విపరీతంగా చూస్తారు. 

ఇలాంటి పరిస్థితులలో ఇతడికి దుబాయ్ విమాన సంస్థలో పనిచేసే నికితా శర్మ పరిచయం అయి ఆ తరువాత ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడటంతో వీరిద్దరి ప్రేమ మధ్యలో బ్రేక్ పడింది. ఆ తరువాత నికితా శర్మ వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలియగానే ఉద్రేకానికి లోనైన జానీ దాదా నికితా శర్మను హత్య చేసాడు. 

అయితే ఈ హత్యకు సంబంధించిన విచారణలో జానీ దాదా తనను ఈ హత్యకు ప్రేరేపించింది ‘కబీర్ సింగ్’ మూవీ అని చెప్పడంతో అక్కడి పోలీసులు షాక్ అయినట్లు సమాచారం. ‘నాకు దక్కనిది.. మరొకరికి దక్కడానికి అవకాశం ఇవ్వను’ అని ‘కబీర్ సింగ్’ లో ఉన్న డైలాగ్‌ తనను ఇలా హత్యా చేయడానికి ప్రభావితం చేసింది అంటూ జానీ దాదా బయటపెట్టిన విషయాలను బాలీవుడ్ మీడియా చాల ప్రముఖమైన వార్తలుగా ప్రచురించింది. ఈ విషయాలు అన్నీ దర్శకుడు సందీప్ రెడ్డి దృష్టి వరకు వెళ్ళడంతో అతడు ఈ హత్యను ఖండించడమే కాకుండా తాను తన సినిమాలో ప్రేమలో విఫలం అయితే హత్యలు చేయమని ఎక్కడా తాను చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: