టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన దర్శకుడు పూరి జగన్నాథ్. తొలి సినిమా బద్రి నుండి పూరి తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ హీరో పాత్రలు ఎంతో ప్రత్యేకంగా ఉండడం గమనించవచ్చు. ఆయన తీసే సినిమాల్లోని హీరోల క్యారెక్టర్లలో ఉండే ఇంటెన్సిటీ, మిగతా దర్శకుల సినిమాల్లో ఉండదని అంటుంటారు కొందరు ప్రేక్షకులు సహా సినీ విశ్లేషకులు. ఇక కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని పూరి, ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. 

ఇక ఇటీవల ఆయన తనయుడు ఆకాష్ పూరి, ఆంధ్ర పోరి అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. నిజానికి చిన్నప్పుడే బుజ్జిగాడు, గబ్బర్ సింగ్, చిరుత సినిమాల్లో ఆకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. అయితే హీరో అయ్యాక నటించిన తొలి సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో, రెండవ సినిమాను తెరకెక్కించే బాధ్యతను పూరి తీసుకుని, కొడుకుతో మెహబూబా అనే సినిమాను తీయడం జరిగింది. అయితే ఇటీవల ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం కొడుకు సక్సస్ నటిస్తున్న కొత్త సినిమా 'రొమాంటిక్' ను నటి ఛార్మితో కలిసి తన పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న పూరి, ఆ సినిమాలోని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం, బాహుబలి శివగామి పాత్రధారి రమ్యకృష్ణ గారిని తీసుకున్నారట. 

సినిమా మొత్తం చాలా వరకు నడిచే ఆ పాత్ర, సినిమాకు ఎంతో కీలకమైందని అంటున్నారు. నూతన నటి కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తొలిసారి మెగా ఫోన్ పడుతున్న అనిల్ పాదూరి తెరకెక్కిస్తున్నాడు. మంచి రొమాంటిక్, లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ ఒక స్లమ్ ఏరియాలో పనిచేసే యువకుడిగా నటిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. మరి ఇప్పటివరకు నటించిన రెండు సినిమాలతో పెద్దగా సక్సెస్ అందుకోని ఆకాష్, ఈ మూడవ సినిమా రొమాంటిక్ తో ఎంత మేర విజయాన్ని అందుకుంటాడో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: