సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ శిష్యుడు తన మొదటి సినిమాతోనే క్రియోటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ డర్శకుడు కృష్ణవంశీ. సింధూరం, నిన్నే పెళ్ళాడతా, అంతః పురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ వంటి సినిమాలు ఆయన కెరీర్ లో గొప్పగా చెప్పుకోదగిన సినిమాలు. సినిమానే ప్రాణంగా చేసే ఈ డైరెక్టర్ చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అయితే ఆయన తీసిన సినిమాలలో అంతకుమించి ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. గతకొంత కాలంగా హిట్ అనే మాటకు చాలా దూరంగా ఉండిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే కృష్ణవంశీ మంచి హిట్ సినిమా తీసి 12 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు కానీ అవేవీ సక్సస్ ని ఇవ్వలేకపోయాయి. 

'నక్షత్రం' సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ క్రియోటివ్ డైరెక్టర్ మొత్తానికి సినిమా చేయబోతున్నాడు. తన నెక్స్ట్ సినిమాకు ఓ రీమేక్ ను ఎంచుకున్న కృష్ణ వంశీ తాజాగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసి రీమేక్ అనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. 2016 లో మరాఠీ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'నట సామ్రాట్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు . ఒరిజినల్ సినిమాలో నానా పటేకర్ చేసిన క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ నటిస్తుండటం విశేషం. వాస్తవంగా కృష్ణవంశీకి ప్రకాష్ రాజ్ కి మంచి ట్యూనింగ్ ఉంది. అలాగే రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది. 2004లో కృష్ణవంశీ తీసిన 'శ్రీ ఆంజనేయం' సినిమాలో రమ్యకృష్ణ నటించారు. ఆ తర్వాత తన భర్త తీసిన ఏ సినిమాలోనూ రమ్యకృష్ణ నటించలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి భర్త డైరెక్షన్ లో రమ్యకృష్ణ నటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక నట సామ్రాట్ లో మ్రున్మయి దేశ్ పాండే చేసిన రోల్ కి తెలుగులో అవికా గోర్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను అభిషేక్ జవ్కర్ - మధు కళిపు సంయుక్తంగా నిర్మించనున్నారు. మరి గ్యాప్ తర్వాత ఈ రీమేక్ సినిమాతో వస్తున్న కృష్ణ వంశీ హిట్టు కొట్టి మళ్ళీ ఫాంలోకి వస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ఇక ఈ సినిమాతో పాటు రమ్యకృష్ణ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో రొమాంటిక్ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: