త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా అల వైకుంఠ పురంబులో. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిలిచాయి. “నా పేరు సూర్య” దారుణంగా ఫ్లాప్ కావడంతో చాలా టైం తీసుకొని త్రివిక్రమ్ చెప్పిన అలా వైకుంఠపురం సినిమా స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించి త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ అందుకోవటానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్ని విధాలా కృషి చేస్తున్నాడు.


ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టాబు మరియు అక్కినేని కుటుంబానికి చెందిన అక్కినేని సుశాంత్ నటించడంతో ఈ సినిమాపై తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వెరైటీ సబ్జెక్టు త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ ని గతంలో ఎన్నడూ చూపించని విధంగా చూపిస్తున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న క్రమంలో అలా వైకుంఠపురం సినిమాపై ఆసక్తి అంచనాలు విపరీతంగా నెలకొన్నాయి. ఇదిలావుండగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించి “సామజవరగమన” సాంగ్ విడుదలయ్యి యూట్యూబ్ లో అనేక రికార్డులు సృష్టిస్తోంది.


అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ మరొకటి ఇండస్ట్రీలో వినబడుతోంది. అదేమిటంటే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ పాటను ఈ దీపావళి కానుకగా విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.సాధ్యమైనంతవరకు కూడా ఈ దీపావళికే “అల వైకుంఠపురములో” సెకండ్ సింగిల్ రావడం ఖాయమని తెలుస్తుంది. దీంతో ఈ వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు సినిమా సాంగ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: