ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఏదోవిధంగా పవన్ కళ్యాణ్ ను ఒప్పించి సినిమాలో నటింప చేయడానికి ప్రస్తుతం ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు దర్శకుడు క్రిష్ అదేవిధంగా హరీష్ శంకర్ లు ఈ మధ్య పవన్ ను కలిసి రెండు కథలను వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ రెండు కథలు కూడ సోషల్ మెసేజ్ తో కూడుకుని ఉండటంతో పవన్ ఈ ఈద్దరి దర్శకులు చెప్పిన కథలను చాల శ్రద్ధగా విన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కథలు పవన్ కు నచ్చాయి అని అంటున్నారు. అయితే ఈసారి పవన్ ‘అజ్ఞాతవాసి’ విషయంలో చేసిన పొరపాటు మరొకసారి చేయకుండా ఈ రెండు కథలను కూడ విని తన అభిప్రాయం చెప్పవలసిందిగా పవన్ చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. 

పవన్ కోరిక మేరకు త్వరలోనే చిరంజీవి క్రిష్ హరీష్ స్నాకర్ లను తన వద్దకు పిలిపించుకుని వారిద్దరి చేత కథలు చెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పవన్ కు హరీష్ శంకర్ చెప్పిన కథ కంటే క్రిష్ చెప్పిన కథ బాగా నచ్చినప్పటికీ హరీష్ శంకర్ ను పక్కకు పెట్టి క్రిష్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సన్నిహితులు చెపుతున్న ఒక సెంటిమెంట్ అడ్డు పడుతున్నట్లు టాక్. 

పవన్ వరస పరాజయాలలో ఉన్నప్పుడు హరీష్ శంకర్ ‘గబ్బరి సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తిరిగి ట్రాక్ లోకి తీసుకు వచ్చిన నేపధ్యంలో మళ్ళీ పవన్ హరీష్ తోనే మూవీ చేస్తే కలిసి వస్తుందని సెంటిమెంట్ రీత్యా పవన్ సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ కావడంతో పవన్ చేయబోయే మూవీ హరీష్ తోనే ఉండటం అన్ని విధాల మంచిదని సలహాలు ఇస్తున్నపటికీ ఈ రెండు కథలను విన్న తరువాత చిరంజీవి ఇచ్చే సలహాను బట్టి పవన్ ఫైనల్ నిర్ణయం ఆధారపడి ఉంటుబంది అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: