కన్నడ సెన్సేషన్ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఛలోతో సత్తా చాటి గీతా గోవిందం సినిమాతో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అమ్మడు వరుసగా స్టార్ అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు మూవీ లో నటిస్తుంది. 

 

ఇదే కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబో లో వచ్చే సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. తెలుగులోనే కాదు తమిళ కన్నడ భాషల్లో కూడా రష్మిక ఫుల్ బిజీ అయ్యింది. అయితే తెలుగులో దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కు హ్యాండ్ ఇచ్చిందట రష్మిక. 

 

అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్ రాజు నూతన దర్శకుడు శశి డైరెక్షన్ లో ఓ మూవీ ప్లాన్ చేశారు. ఆ మూవీలో రష్మికను హీరోయిన్ గా అనుకున్నారు.. కాని ముందు ఓకే చెప్పినా డేట్స్ అడ్జస్ట్మెంట్ కాక రష్మిక ఆ ఛాన్స్ మిస్ చేసుకుందట. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత సినిమా కాదనడానికి గట్స్ ఉండాలి. కాని రష్మిక అలా చేయాల్సి వచ్చింది. 

 

మహేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో నటిస్తున్న రష్మిక చైతన్యను కాదనడానికి కేవలం డేట్స్ ఒక్కటే కారణమా లేక అడిగిన పారితోశికం ఇవ్వనన్నారా అంటూ రకరకాల వార్తలు వస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: