టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ ఇప్పటి వరకు తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. టాలీవుడ్ లో వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ సంస్థ మరో వినూత్న ప్రయోగానికి సిద్దమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. కంటెంట్ డ్రైవన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ మూవీ అందరూ కొత్త వాళ్లతో రూపొందనుంది. 

రితేష్‌ రానా అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ‘మత్తు వదలరా’ అనే సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీ టైటిల్ లుక్‌ విడుదలైంది. పోస్టర్ వినూత్నంగా ఆకట్టుకునే విధంగా ఉంది. పోస్టర్ లో ఖైదీ సినిమాలోని మెగాస్టార్ గెటప్ ను, అలాగే సూపర్ మ్యాన్ గెటప్ లో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గెటప్ ను ఎస్టాబ్లిష్ చేశారు. మరి సినిమా ఏ జోనర్ లో ఉండబోతుందో గాని, పోస్టర్ ను మాత్రం బాగా వైవిధ్యంగా డిజైన్ చేశారు.

మొత్తానికి పోస్టర్‌లో ఎన్టీఆర్, చిరంజీవి ఫొటోలు పెట్టి టైటిల్‌ను డిఫరెంట్‌గా చూపించారు.   రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, నటినటులను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటికే ఈ మైత్రీ సంస్థ‌ లో శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ , రంగ‌స్థ‌లం లాంటి భారీ విజయాలు వచ్చాయి, రానున్న రోజుల్లో కొత్త నటులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలు కూడా వస్తాయోమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: