డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో అప్పట్లో 1996వ సంవత్సరంలో విలక్షణ నటుడు కమల హాసన్ హీరోగా నటించిన భారతీయుడు సినిమా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ సైడ్ కూడా అదిరిపోయే హిట్ టాక్ సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దక్షిణాది సినిమా రంగంలో ఉన్న చాలా ఇండస్ట్రీలో విడుదలయి రికార్డు కలెక్షన్లతో నిర్మాతకు అదిరిపోయే లాభాలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతం అందించిన ఏ ఆర్ రెహమాన్ సినిమా కి ఇచ్చిన పాటలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హిట్ గా ఉండటం విశేషం.


అంతగా సినిమా హిట్ అవడంతో వరుస ఫ్లాపులతో ఇటీవల కెరీర్ని నెట్టుకొస్తున్న డైరెక్టర్ శంకర్ తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ మొదలు పెట్టడం మనందరం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో ఒక యాక్షన్ సీన్ కోసం ఏకంగా 40 కోట్లు నిర్మాత చేత శంకర్ ఖర్చు చేయించినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి...తెరకెక్కుతున్న యాక్షన్ సీన్ ని భోపాల్ లో పీటర్ హెయిన్స్ సారథ్యంలో శంకర్ చిత్రీకరించనున్నట్లు సమాచారం.


అయితే ఈ యాక్షన్ సీన్ సినిమాకి అతికీలకమైన హైలెట్ అని అంటున్నారు సినిమా యూనిట్ కి చెందినవారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎక్కువైపోతున క్రమంలో డైరెక్టర్ శంకర్ కి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు తక్కువ బడ్జెట్ లో యాక్షన్ ఎపిసోడ్ నీ చిత్రీకరించాలని చెప్పటం జరిగిందట. క్వాలిటీ కోసం శంకర్ అంత ఈజీగా తగ్గడనేది అందరికి తెలిసిన విషయమే. కానీ కాలం కలిసిరాకపోతే కొన్ని మనసు చంపుకొని చేయకతప్పదు. అందుకే శంకర్ నిర్మాతల కండిషన్స్ కి కాదనలేక క్వాలిటీ మిస్ అవ్వకుండా  బడ్జెట్ పరిమితులతో సినిమాను డిజైన్ చెయ్యాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: