కొత్త బంగారు లోకం సినిమా ద్వారా మంచి విజయం అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా విజయం తర్వాత అతనికి ఏకంగా ఇద్దరు స్టార్లని దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఫలితంగా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు" సినిమా బయటకి వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ మధ్యలో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ సినిమా ఫలితం ద్వారా శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా మారాడు.


కుటుంబ కథా చిత్రాలు బాగా తీస్తాడన్న పేరు రావడంతో శ్రీకాంత్ కి సూపర్ స్టార్ తో సినిమా అవకాశం వచ్చింది. అయితే మహేష్ తో తీసిన "బ్రహ్మోత్సవం" సినిమా ఫ్లాప్ అవడంతో అతని రాత మారిపోయిందనే చెప్పాలి. బ్రహ్మోత్సవం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలైంది. సూపర్ స్టార్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉందని చాలా వార్తలు వచ్చాయి. సినిమా ఫ్లాప్ కావడంతో శ్రీకాంత్ అడ్డాలకి అవకాశాలు రాకుండా పోయాయి.


సినిమాల్లో హిట్లుంటేనే డిమాండ్ ఉంటుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఆ దర్శకుడికి మళ్లీ అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి.ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల అలానే కష్టపడుతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా వచ్చి మూడు సంవత్సరాలయినా అతని తర్వాత చిత్ర్ం ఏంటనేది ఇంకా ప్రకటించలేదు. ఇటీవల ఆయన నానితో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే నానినే స్వయంగా స్పందించి ఆ వార్తలన్నీ పుకార్లేనని చెప్పాడు.


దాంతో శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎప్పుడు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల త్వరలోనే సినిమాని పట్టాలెక్కించడానికి ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. వరుణ్ తేజ్ తో గాని, నానితో గాని సినిమా ఉండొచ్చు అని ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: