సైరా సినిమాలో లో అద్భుతమైన నటన కనబర్చిన తమన్నా రాజు గారి గది-3’ లో నటించనున్నదనే వార్తలకు.. ఆ సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. ‘రాజు గారి గది-2’ లో నాగార్జున సమంత నటించిన ప్లాప్ కాగా., తమన్నా ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యంగానే అనిపించింది. కానీ ప్రారంభోత్సవంలో పాల్గొని కూడా తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుని పెద్ద షాకిచ్చింది తమన్నా. అయితే దర్శక నిర్మాత ఓంకార్.. ఎక్కువ టైం తీసుకోకుండా అవికా గోర్‌ను ఆమె స్థానంలోకి తీసుకుని చకచకా సినిమా పనులు పూర్తి చేసేశాడు. నేడే ఈ సినిమా రిలీజవుతోంది. 
ఈ మధ్య మీడియాను కలిసి ఈ చిత్ర హీరో, ఆశ్విన్ తో పాటు తమన్నా నటించాలి కానీ డేట్స్ కుదరని కారణంగా సినిమా నుంచి ఈమె తప్పుకున్నారన్నారు. కానీ ఇప్పుడు దర్శకుడు ఓంకార్ మాత్రం ‘రాజు గారి గది-3’ కథతో పాటు తన పాత్రను కూడా మార్చాలని తమన్నా డిమాండ్ చేయడంతోనే ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఓంకార్ ఆరోపించారు. ‘‘సినిమాలో ముందుగా తమన్నాను తీసుకున్న మాట నిజమే కానీ ముందుగా ఆమెకు సినిమా లైన్ మాత్రమే చెప్పాం. ఆ లైన్ ఆమెకు నచ్చింది. కానీ సినిమా ప్రారంభమవడానికి కొద్దిరోజుల ముందు ఫుల్ కథ చూసి దానికి ఆమె చాలా మార్పులు చెప్పారు.
ఈ కథలో ఆమె పాత్రను మార్చమని, దానికి తగ్గట్టుగా కథ లో కూడా కొంత మార్పులు చేయమని ఆమె కోరారు. అయితే సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సమయం ఎక్కువ లేని కారణంగా కథలో మార్పులు చేయడానికి మాకు కూడా వీలు పడలేదు. దీంతో తమన్నాని వద్దనుకున్నాం. ఈ పాత్ర కోసం తాప్సి, కాజల్ వంటి స్టార్ హీరోయిన్ల కోసం ప్రయత్నించాం. కానీ వాళ్లు సినిమాలతో బిజీ గా ఉంది డేట్లు ఖాళీ లేకపోవడంతో అవికాగోర్ ను ఎంచుకున్నాం. ఆ అమ్మాయి ఉయ్యాల జంపాల, లక్ష్మి మా ఇంటికి రావే లాంటి హిట్ సినిమాలో వలె ఇప్పుడు తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందన్నారు ఓంకార్..


మరింత సమాచారం తెలుసుకోండి: