సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అను నేను’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. ఆ ఒక్క సినిమా లో నటించడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత.. రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లోనూ తన అందచందాలతో అందరినిఆకర్షించింది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు సిద్ధం అవుతుంది ఈ భామ.
తాజాగా
షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్తో బాలీవుడ్లో కూడా తనకంటూ మంచి పేరును సంపాదించుకుంది. అక్కడ వరుస కమిట్మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటోంది ఈ భామ. ప్రస్తుతం
కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామెడీ సినిమాలో నటిస్తుంది అని సమాచారం. ‘కాంచన’ మూవీకి రీమేక్గా ఈ సినిమా రాబోతుంది అని తెలియచేసారు చిత్ర యూనిట్. అలాగే 'ఇందూ కీ జవానీ' అనే మరో సినిమాకి కూడా ఒకే చెప్పింది ఈ భామ.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కియారా .. హీరోయిన్ల కు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీలో ఓ నటిగా స్థిరపడాలంటే అందం ఒక్కటే సరిపోదని , ఆత్మవిశ్వాసం, ఇచ్చిన పాత్రలో మెప్పించే సత్తా ఉంటేనే మాత్రం రాణించడం సాధ్యం అని తెలిపింది కియారా .
ఇక తన మేకప్ గురించి కియారా మాట్లాడుతూ.. తాను తక్కువ మేకప్ వేసుకుంటానని, చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా జాగ్రత్త పడుతాను అని చెప్పింది. ఇక కియారా చేస్తున్న తాజా సినిమా 'ఇందూ కీ జవానీలో' కియారా లీడ్ రోల్ చేస్తుంది. ఇదే ఆమెకు ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా అంట. ఈ సినిమాలో ఘజియాబాద్ అమ్మాయి ఇందూ గుప్తా పాత్రలో పోషిస్తుంది కియారా. డేటింగ్ యాప్ల నేపథ్యంతో అబిర్ సేన్గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. సోషల్ మీడియాలో బోల్డ్ లుక్స్ పోస్ట్ చేస్తూ యూత్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చెయ్యడంలో కియారా బాగా ముందు ఉంది.