‘సైరా’ మూవీలో నయనతార నటించినా ఆమె పాత్రకంటే ఇదే మూవీలో   లక్ష్మి పాత్రలో నటించిన తమన్నాకు ప్రశంసలు లభిచడంతో నయనతార తీవ్ర అసహనానికి గురి అవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ‘సైరా’ మూవీలో నయనతార నటించడానికి మొదట్లో ఆమె ఒప్పుకోకపోయినా చరణ్ బలవంతంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంటారు. 

నయనతారను ఒప్పించడానికి చరణ్ ఆమె కెరియర్ లో ఎవరూ ఆమెకు ఇవ్వనంత అత్యధిక పారితోషికం ఇచ్చినట్లు కూడ వార్తలు వచ్చాయి. అయితే ఆమెను ఒప్పించే సమయంలో ఆమె పాత్ర పెద్దది అనీ  తమన్నా పాత్ర చిన్నది అనీ చరణ్ చెప్పి ఒప్పించినట్లు టాక్. 

అయితే ఈ సినిమా మొదలైన తరువాత స్క్రిప్ట్ లో వచ్చిన మార్పులు వల్ల ఆతరువాత ఈ సినిమా ఎడిటింగ్ సమయంలో జరిగిన కటింగ్స్ వల్ల నయనతార పాత్ర పూర్తిగా తగ్గిపోయి తమన్నా పాత్ర పూర్తిగా పెరిగి పోయింది. దీనితో షాక్ అయిన నయనతార ఈ మూవీ విడుదలైన తరువాత తన పాత్రను ఈ మూవీలో ఎందుకు తగ్గించి వేసారు అంటూ నయన్ చరణ్ ను ప్రశ్నించినట్లు ఆలస్యంగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు తన పాత్రను తగ్గించివేసి తమన్నా పాత్రను పెంచి తాను ఈ సినిమా ప్రమోషన్ కు సహకరించలేదు అంటూ తన పై అభాండాలు వచ్చేలా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆమె చరణ్ ను ప్రశ్నించింది అంటూ కోలీవుడ్ మీడియాలో ఇప్పుడు గాసిప్పులు వస్తున్నాయి. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా నయనతార ఆవేదనలో ఎంతోకొంత వాస్తవం ఉంది అన్నది మాత్రం నిజం. దీనితో నయనతారకు కోట్లల్లో పారితోషికం ఇచ్చి అనవసరంగా ఆమె చేత రామ్ చరణ్ ప్రశ్నించుకోవలసిన పరిస్థితికి రామ్ చరణ్ చేరుకున్నాడా అంటూ మరి కొందరు చరణ్ పై కామెంట్స్ చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: