చలో ఈ సినిమాతో టాలీవుడ్ కి ఏంట్రీ  ఇచ్చిన హీరోయిన్ రష్మిక మందన్న. అయితే మొదటి సినిమా నుంచి ఈ అమ్మడి లక్కు బాగా కలిసి వస్తుంది. అందుకే మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో పాటు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. దీంతో వరస సినిమా లతో దూసుకు పోతుంది ఈ అమ్మడు. ఇక విజయ్ దేవరకొండ తో జోడీ కట్టి నటించిన గీతా గోవింద సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. అందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇదే జోడీ  తాజాగా డియర్ కామ్రేడ్ లో రిపీట్ అయినప్పటికీ... ఎందుకో  ఆ సినిమా వీరిద్దరికీ బెడిసికొట్టింది. అయితే రష్మిక మందన కి కన్నడంలో కూడా మంచి క్రేజ్ ఉండటంతో అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 

 

 

 

 

 అందం అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మ... సినిమాల్లో అందాలు ఆరబోయడం చేయనప్పటికీ తన కను  సైగలతోనే కుర్రకారు మతి పోగొడుతుంది ఈ అమ్మడు. అయితే రష్మిక మందన్న హిందీలో వచ్చిన ఒక క్రేజీ ఆఫర్ ని వదులుకుందట . బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ రీసెంట్ గా  తెలుగు సినిమా అర్జున్ రెడ్డి ని హిందీలో కబీర్  సింగ్ పేరుతో రీమేక్ చేసి తన అద్భుతమైన నటనతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు అదే ఊపులో  మరో తెలుగు సినిమాని రీమేక్ నటించి  హిట్టు కొట్టాలని ఆశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాని హీరోగా శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికగా నటించిన జర్సీ  సినిమాని హిందీలో రీమేక్  చేస్తున్నారు.

 

 

 

 

 కాగా తెలుగు వెర్షన్ ని డైరెక్ట్ చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా  హిందీ లో ఈ సినిమాని అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే జెర్సీ రీమేక్లో నటిస్తున్న షాహిద్ కపూర్ సరసన రష్మిక మందన ను ఎంపిక చేశారట చిత్రబృందం. కానీ ఈ అమ్మడి చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉండటంతో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకి నో చెప్పిందట. కాగా ఇప్పుడు షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఒకవేళ రష్మిక మందన్న ఈ మూవీని ఓకే చెప్పి ఉంటే బాలీవుడ్ లో కూడా తన హవా నడిపించి ఉండేదని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: