పాశ్చాత్య సంస్కృతీ పోకడలు దేశంలోకి ఎలా వస్తున్నాయి.. ఎంతగా విస్తరిస్తున్నాయో అందరికి తెలిసిందే. సినిమాల్లో చూపించినట్టుగా పబ్లిక్ గానే ప్రేమించుకోవడం, పబ్లిక్ గానే రొమాన్స్ చేయడం వంటివి చేస్తున్నారు. ఆ ఎవరు ఏమంటారులే అని ధైర్యంతో ఇలా చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా... శృతిమించిపోయి.. చివరకు లాక్కోలేక పీక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు.
అబ్బాయిని నమ్మి మోసపోయిన అమ్మాయి.. అమ్మాయి ఆత్మహత్య.. ఇలా ఎన్నో రకాల వార్తలు టివిల్లోనూ పేపర్లోనూ చదువుతున్నాం. వాటిని చదివి ఊరుకుంటున్నారుగాని, దాని నుంచి బయటపడేందుకు మాత్రం మార్గాలను చూడటం లేదు. పైగా ప్రేమించుకునే సమయంలో తీసుకున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వలన కలిగే అనర్ధాలు ఏంటో అందరికి తెలుసు.
తెలిసి కూడా అలానే పోస్ట్ చేస్తున్నారు. చేసిన తరువాత కేసులు కావడం వంటివి జరుగుతూనే ఉంటాయి.జీవితాలు పాడైపోతుంటాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీటు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది
శ్రీ రెడ్డి. శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతాఇంతా కాదు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో.. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చింది.
అక్కడి నుంచి చెన్నై చెక్కేసింది. అక్కడే ఉండి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చుకుంటోంది. ఇటీవలే చెన్నై బీచ్ కు వెళ్లిన తరువాత అక్కడ ఓ దృశ్యం పాపం ఈ అమ్మడి కంటపడింది. ఓ ఇద్దరు ప్రేమికులు రోడ్డుపై నిలబడి ప్రేమించుకుంటున్నారు. వారి వయసు 13-14లోపే ఉంటుంది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానిపై కొన్ని కామెంట్స్ చేసింది. ఇలా పోస్ట్ చేసిన తరువాత వాటిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అది మాములుగా కాదు. మైనర్లు అని చెప్తూనే.. ఇలా వాళ్ళ గురించి ఎందుకు పోస్ట్ చేసినట్టు అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.