ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కి  అభిమానుల్లో  ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బస్ కండక్టర్ గా  పనిచేసిన రజినీకాంత్ అంచలంచలుగా ఎదుగుతూ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే రజనీకాంత్ స్టైల్,  యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అభిమానులకి  అదో  తెలియని పిచ్చి. అందుకే రజిని సినిమాలంటే ఎగబడి చూస్తారు అభిమానులు . అయితే నిరాడంబరతకు మారు పేరుగా ఉండే రజనీకాంత్ కు ... తన కోసం వెర్రి అభిమానం ప్రదర్శించడం ఇష్టం ఉండదు. అలా వెర్రి  అభిమానం  ప్రదర్శించిన అభిమానులకు ... మందలించి స్వీట్ వార్నింగ్ ఇస్తుంటారు రజినీకాంత్. 

 

 

 

 

 అయితే రజనీకాంత్ ఏ  సినిమా చేసిన  షూటింగ్ పూర్తయిన హిమాలయాల్లోకి వెళ్లి బాబా గుహలు ధ్యానం చేసి వస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రజినీకాంత్... హిమాలయాలకు వెళ్లారు. అక్కడ మహా పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ అమర్నాథ్ క్షేత్రాలను దర్శించుకోవడం తోపాటు... బాబా గుహలో ధ్యానం చేస్తారు  రజనీకాంత్. ఇటీవలే  హిమాలయాలకు వెళ్ళిన రజిని  అక్కడ బాబా గుహలో ధ్యానం  ముగించుకొని చెన్నైకి వచ్చారు. అయితే రజినీకాంత్ చెన్నై ఎయిర్ పోర్టుకు  చేరుకునేసరికి అర్ధరాత్రి సమయం అయినప్పటికీ రజినీకాంత్ కోసం చాలా మంది అభిమానులు  విమానాశ్రయానికి తరలివచ్చారు . 

 

 

 

 

 అయితే  విమానాశ్రయంలో అభిమానులందరికీ నవ్వుతూ అభివాదం చేసిన రజనీకాంత్... ఇంటికి బయలుదేరారు. కాగా  రజినీకాంత్ ఇంటికి చేరుకునే క్రమంలో ఓ అభిమాని బైక్ పై ఆయన ను ఫాలో అయ్యారు. ఇది గమనించిన రజనీకాంత్ ఇంటికి చేరుకోగానే ఆ అభిమానిని తన ఇంటి లోపలికి పిలిచారు. అయితే రజినీకాంత్ ఇంట్లో పిలవడంతో ఎంతో ఆనందంతో ఇంట్లోకి వెళ్ళాడు అభిమాని . కాగా  ఇంత రాత్రివేళ బైక్ పై  ప్రయాణించడం క్షేమకరం కాదని అభిమానిని  రజనీకాంత్ మందలించారు. మరోసారి ఇలాంటివి చేయొద్దని తెలిపిన రజినీకాంత్ అభిమాని తో ఫోటో దిగాడు. తన అభిమాన నటుడు రజనీకాంత్ దిగిన ఫోటోలు ఆ  అభిమాని  సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా...  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూ  వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: