సంక్రాంతి వార్ బన్నీ మహేష్ ల వార్ గా మారడంతో పైకి చెప్పుకోకపోయినా మహేష్ కు టెన్షన్ ను కలిగిస్తున్నట్లు టాక్. ఈ ఏడాది సమ్మర్ రేసుకు వచ్చిన ‘మహర్షి’ సక్సస్ అయినప్పటికీ ఈ మూవీని చాల భారీ రేట్లకు మార్కెట్ చేయడంతో తెలుగు రాష్ట్రాలలో కొంతమంది బయ్యర్లు నష్టపోయారు. 

దీనితో అలాంటి పొరపాటు జరగకుండా మహేష్ తన లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ కు సంక్రాంతి సీజన్ ను ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ మహేష్ అల్లు అర్జున్ ల మూవీలు ఒకేరోజు విడుదల అవుతున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ ఎంతో కొంత దెబ్బతిని తీరుతాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఇది చాలదు అన్నట్లుగా ‘అల వైకుంఠపురంలో’ మూవీ టీమ్ ఈ మూవీ ప్రమోషన్ ను 100 రోజులు ముందుగా మొదలు పెట్టి మరొక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. 

ఈ మూవీకి సంబంధించిన ‘సామజవరగమన’ పాటను లిరికల్ వీడియోగా కాకుండా తమన్ పై 25 లక్షలు ఖర్చు పెట్టి ప్రమోషన్ సాంగ్ గా విడుదల చేయడంతో ఈ ప్రయోగం నచ్చి ఈ పాటకు ఇప్పటికే 40 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో రావడం సంచలనంగా మారింది. ఇది చాలదు అన్నట్లుగా ఈ మూవీకి సంబంధించిన ఒక పార్టీ సాంగ్ ను రాబోతున్న దీపావళి రోజున విడుదల చేయబోతున్నారు. పక్కా మాస్ బీట్ తో ఉండే ఈ పాట యూత్ కు మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకులకు కూడ బాగా కనెక్ట్ అయి ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్ గా మారుతుంది అని అంటున్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీ పాటల ట్యూన్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ ఈ మూవీకి ప్లస్ పాయింట్ గా మారబోతోంది. దీనికితోడు ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ట్యూన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో దేవిశ్రీ అందించిన ట్యూన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ కు ఎంత వరకు సహకరిస్తాయి అన్న అనుమానాలు మహేష్ కు ఉన్నట్లు టాక్. దీనితో పంతాలు పోకుండా తన మూవీని జనవరి 11న వచ్చే విధంగా ఒకరోజు ముందుకు జరగాలని మనసు నిండా ఉన్నా తన అభిప్రాయాలను బయటకు చెప్పుకోలేక మహేష్ మాధనపడుతున్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: