ఇండస్ట్రీలో స్టార్ హీరోలు రీమేక్ సినిమాల్లో నటించటం సాధారణమైన విషయమే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున కూడా రీమేక్ సినిమాల్లో నటించిన వారే. ప్రస్తుతం టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో మహేశ్ బాబు, అల్లు అర్జున్ తప్ప మిగతా హీరోలందరూ రీమేక్ సినిమాల్లో నటించారు. కొందరు రీమేక్ సినిమాలతో హిట్లు అందుకొంటే మరికొందరు మాత్రం అపజయాల్ని చవిచూశారు. 
 
టాలీవుడ్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాల్లో నటించాడు. పవన్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, అన్నవరం, గబ్బర్ సింగ్, తీన్ మార్, కాటమరాయుడు, గోపాల గోపాల సినిమాలు పవన్ కెరీర్లో రీమేక్ చిత్రాలుగా ఉన్నాయి. ప్రభాస్ నటించిన యోగి, బిల్లా సినిమాలు రీమేక్ సినిమాలే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనై ఒరువన్ రీమేక్ ధృవ సినిమాలో నటించాడు. 
 
జూనియర్ ఎన్టీయార్ నటించిన నరసింహుడు సినిమా కన్నడంలో హిట్టైన దుర్గి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. రీమేక్ సినిమాలతో పవన్ కళ్యాణ్ ఎక్కువగా హిట్లు కొట్టాడు. రామ్ చరణ్ నటించింది ఒక్క రీమేక్ చిత్రంలోనే కానీ రామ్ చరణ్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్, జూనియర్ ఎన్టీయార్ కు మాత్రం రీమేక్ చిత్రాలు విజయాన్ని అందించలేకపోయాయి. 
 
మహేశ్ బాబు నటించిన నాని సినిమా చాలామంది రీమేక్ అనుకుంటారు కానీ నాని సినిమా తమిళంలో, తెలుగులో ఒకేసారి తెరకెక్కింది. మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఇప్పటివరకు స్ట్రెయిట్ సినిమాల్లోనే నటిస్తున్నారు. మరి ఈ ఇద్దరు హీరోలు భవిష్యత్తులోనైనా రీమేక్ సినిమాల్లో నటిస్తారో లేదో చూడాలి. రీమేక్ సినిమాల్లో నటించని ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు 2020 సంవత్సరంలో ఒకే రోజున విడుదల కాబోతూ ఉండటం విశేషం. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: