'అర్జున్ రెడ్డి'.. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం, ఎవరూ ఊహించని విధంగా  సంచలనాత్మక  విజయాన్నే అందుకుంది.  ఆ విజయానికి తగ్గట్లుగానే  ఆ సినిమాలో  హీరోగా నటించిన  విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే  స్టార్ హీరో అనిపించుకున్నాడు. కాకపోతే అర్జున్ రెడ్డికి హీరోయిన్ గా బోల్డ్ క్యారెక్టర్ రెచ్చిపోయిన  షాలినీ పాండేకు మాత్రం ఆ సినిమా తరువాత  ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.  ఈ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ '118'ను మినహాయిస్తే.. అర్జున్ రెడ్డి తరువాత  ఆమెకు హీరోయిన్ గా  సరైన సినిమానే  లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హీరోయిన్ కు ఓ మంచి సినిమా  వచ్చింది. అదే  ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో   రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న  'ఇద్దరి లోకం ఒకటే'. 

ఈ  సినిమాలో  షాలినీ పాండేను  మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు.  ఒక విధంగా ఇది   షాలినీ పాండేకు భారీ ఆఫరే. మరి ఈ సినిమాతోనైనా   షాలినీ పాండేకు కాలం కలిసి వస్తోందేమో చూడాలి.  ఇక రాజ్ తరుణ్ కు  హిట్ వచ్చి చాలా కాలమే  అయిపోయింది.   గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మొత్తానికి  ప్లాప్స్ లో ఉన్న ఈ హీరోహీరోయిన్ల ఇద్దరి బాధ  ప్రస్తుతం ఒక్కటే. మరి  'ఇద్దరి లోకం ఒకటే'తోనైనా ఈ ఇద్దరి బాధ పోయి హిట్ రావాలని ఆశిద్దాం. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జిఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి  మిక్కీ కె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. 

కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా  ఫస్ట్ లుక్  పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే.   ఇప్ప‌టికే 90 శాతం షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 15న  విడుద‌ల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారట.  మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: