బుల్లితెర పై ప్రసారం అయ్యే ‘ఇస్మార్ట్ న్యూస్’ తో పాపులర్ అయిన బిత్తి సత్తి టెలివిజన్ సెలెబ్రెటీగా మారిపోయాడు. ఒకప్పుడు ఆటోలలో తిరిగిన ఈ వ్యక్తి ఈరోజు ఒక ‘ఆడి’ కారు కొనుక్కునే స్థాయికి ఎదిగాడు అంటే అతడి క్రేజ్ ఇప్పుడు ఎలా ఉందో అర్ధం అవుతుంది. 

ఇప్పుడు బిత్తిరి సత్తి కూడ హీరోగా మారిపోతున్నాడు. అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘తుపాకీ రాముడు’ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న జరిగింది. ఈ ఫంక్షన్ కు అనేకమంది తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు అనేకమంది ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు కూడ పాల్గొన్నారు. 

ఒక కింది తరగతి నుండి వచ్చిన ఒక వ్యక్తి హీరోగా మారడం అంత సులువు కాదని తనను నమ్మి ఈసినిమాలో అవకాశం ఇవ్వడమే కాకుండా తన చేత బాలకృష్ణలా తొడ కొట్టించి పవన్ కళ్యాణ్ లా మ్యానిరిజమ్ చేయించిన సీన్స్ ఈ మూవీలో చాల ఉన్నాయి అంటూ ఈ మూవీ పై అంచనాలు పెంచాడు. ఒకప్పుడు బఠానీలు కొనుక్కోవడానికి కూడ డబ్బులు లేని తనకు ఈరోజు బాదం పప్పు తినే స్థాయికి ఎదిగాను అని బిత్తిరి సత్తి చెప్పిన మాటలను బట్టి ఈ వ్యక్తి ఎన్నికష్టాలు పడ్డాడో అర్ధం అవుతుంది. 

అంతేకాదు చాలామంది హీరోలు తమ సినిమాల కోసం సింగపూర్ వెళితే తాను తన సినిమా కోసం సింగరేణి వెళ్ళిన విషయాన్ని బయట పెడుతూ అంతా అక్కడి లోకల్ టాలెంట్ తో ఈ మూవీని తీసిన విషయాన్ని బిత్తిరి సత్తి బయట పెట్టాడు. ఇప్పటి వరకు టెలివిజన్ పై అందర్నీ నవ్వించిన బిత్తరి సత్తి ఈ మూవీలో తన నటన ద్వారా చాలామందిని ఏడిపిస్తాడు అని తెలుస్తోంది. ఈ మూవీ సక్సస్ అయితే ఈ సెలెబ్రెటీకి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: