టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు టాలీవుడ్ హీరోలందరితో ప్రత్యేకం. ఆయన ఎంచుకునే కథలు కానీ... ఆయన నటన కానీ ప్రత్యేకంగా ఉంటాయి.ఇక  మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు అబ్బాయిలకు సూపర్ స్టార్ అయితే... అమ్మాయిల అందరికీ మహేష్ బాబు  తమ కలల రాకుమారుడు. అందుకే టాలీవుడ్ లో మహేష్ బాబుకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కాగా  కథల ఎంపికలో భిన్నంగా ఆలోచిస్తూ భిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నారు మహేష్ బాబు. ఇప్పటికే శ్రీమంతుడు,  భరత్ అనే నేను,  మహర్షి లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నారు మహేష్ బాబు . 

 

 

 

 కాగా ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో మొదటిసారి మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండడంతో... ఈ సినిమా కోసం మహేష్ అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

 

 

 

 

 ఇదిలా ఉండగా మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీ దర్శకుడు వంశీ పైడిపల్లితో ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాను  దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు వంశీ పైడిపల్లి కథపై కసరత్తులు చేస్తున్నారు. కాగా ఈ స్క్రిప్టు మొత్తం పూర్తయి  చేతికి వచ్చే లోపు మరో నాలుగు నెలలు పడుతుందని వంశీ పైడిపల్లి తెలిపారట. ఈ గ్యాప్ లో  కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్  తో సినిమా చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేశారట.దీని కోసం  ఆయనకు కాల్ చేసి  అడిగినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యమైనంతవరకు పట్టాలెక్కే  అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: