స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.


సామజవరగమన అంటూ సిరివెన్నెల సాహిత్యం.. సిద్ శ్రీరాం గానం ఆ సాంగ్ ను సూపర్ హిట్ చేసింది. ఇక ఈ సాంగ్ తర్వాత రాములో రాములా మాస్ సాంగ్ ఒకటి ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే ఏమైందో ఏమో కాని ఈరోజు అనుకున్న సాంగ్ కాస్త రేపటికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది.


మొదటి సాంగ్ తో క్లాస్ ఆడియెన్స్ ను మెప్పించిన తమన్ సెకండ్ సాంగ్ తో మాస్ ఆడియెన్స్ మీద దృష్టి పెట్టాడు. బన్ని సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. అందుకే అల వైకుంఠపురములో సాంగ్స్ కు సూపర్ క్రేజ్ ఏర్పడింది. అయితే సెకండ్ సాంగ్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఆడియెన్స్ కు నిరాశ మిగిలింది. 


సాంగ్ కోసం ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తుండగా సాంగ్ రిలీజ్ టైం వరకు వెయిట్ చేయించి.. సాంగ్ రావడం ఆలస్యమవుతుందని అన్నారు చిత్రయూనిట్. మరి అసలు సాంగ్ రిలీజ్ చేయకపోడానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం తెలియలేదు. సామజవరగమన సాంగ్ తో ఆల్రెడీ ఆల్బం రేంజ్ ఏంటో చూపించిన తమన్ రాములో రాములాతో రచ్చ చేయడం కన్ ఫాం అంటున్నారు. మరి ఈ సినిమాతో మ్యూజిక్ డైరక్టర్ గా తమన్ తన సత్తా చాటేలా ఉండగా కమర్షియల్ హిట్టు కొట్టి బన్ని కూడా బాక్సాఫీస్ షేక్ చేయాలని చూస్తున్నాడు.   


మరింత సమాచారం తెలుసుకోండి: